News October 26, 2025

కాకినాడ: విద్యాసంస్థలకు ఐదు రోజుల సెలవులు

image

తుపాను నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు 26వ తేదీ సాయంత్రం నాటికి ఇళ్లకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ ఐదు రోజులు ఏ ఒక్క విద్యాసంస్థ తెరిచి ఉండకూడదని, కళాశాలలకు కూడా ఈ సెలవు వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

Similar News

News October 26, 2025

ఊట్కూర్: సమాచారం ఇవ్వని అధికారులకు RTI నోటీసులు

image

బతుకమ్మ చీరల పంపిణీ వివరాలు ఇవ్వకపోవడంతో నారాయణపేట జిల్లా డీఆర్‌డీఏ పీడీ, ఊట్కూర్ ఐకేపీ ఏపీఎంలకు రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. 2022 నుంచి ఊట్కూర్ మండల పరిధిలో గ్రామాల వారీగా చీరల పంపిణీ వివరాలు కోరుతూ డీడీ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసినా సమాచారం ఇవ్వలేదని RTI ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నర్సింలు తెలిపారు.

News October 26, 2025

రేపు భద్రాచాలం ఐటీడీఏలో ‘గిరిజన దర్బార్’

image

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం ‘గిరిజన దర్బార్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీఓ రాహుల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి సమస్యలను లిఖితపూర్వకంగా అధికారులకు అందజేయవచ్చని పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో ఈ దర్బార్ జరుగుతుందని, అన్ని శాఖల యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఆయన సూచించారు.

News October 26, 2025

మేడ్చల్: రేపు లక్కీగా వైన్స్ దక్కేదెవరికి?

image

రేపు శ్రీ పలనీ కన్వెన్షన్‌లో ఉ.11 గంటలకు మేడ్చల్-మల్కాజిగిరి యూనిట్లకు సంబంధించి నూతన మద్యం పాలసీ 2025-27కు డ్రా తీయడం జరుగుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మేడ్చల్ యూనిట్‌లోని 118, మల్కాజిగిరి యూనిట్‌లోని 88 మద్యం షాపులకు జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీయడం జరుగుతుంది. దరఖాస్తుదారులు, అధికార ప్రతినిధులు తప్పని సరిగా హాజరుకావాలని సూచించారు. లక్కీ డ్రాలో టెండర్‌ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.