News October 26, 2025

చిన్న శంకరంపేట: గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం

image

చిన్న శంకరంపేట మండలం దరిపల్లి శివారులోని హల్దీ వాగులో గుర్తు తెలియని మహిళ శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతి చెందిన మహిళ ఎవరు అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గ్రామంలో ఎవరైనా తప్పిపోయారా లేదా ఇతర గ్రామాల నుంచి వచ్చిన మహిళ ఇక్కడ చనిపోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 26, 2025

మెదక్: రేపు లక్కీగా వైన్స్ దక్కేదెవరికి..?

image

మెదక్ జిల్లాలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ తెలిపారు. ఈనెల 27న మెదక్‌ పట్టణంలోని శ్రీవెంకటేశ్వర ఫంక్షన్‌ హాల్‌లో డ్రా నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. మద్యం పాలసీ 2025-27కు జిల్లాలోని మొత్తం 49 మద్యం షాపులకు 1,420 దరఖాస్తులు రాగా రూ.42.60 కోట్ల ఆదాయం వచ్చిందని అన్నారు. లక్కీ డ్రాలో ఎవరికి దక్కుతుందో చూడాలి.

News October 26, 2025

31న మెదక్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్: DSP

image

పోలీస్‌ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 31న మెదక్‌ పట్టణంలోని పీఎన్‌ఆర్‌ స్టేడియంలో బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్‌ తెలిపారు. ఇది ‘ఓపెన్ టు ఆల్’ టోర్నమెంట్ అని, 30న సాయంత్రం 5 గంటలలోగా ఆర్‌ఎస్‌ఐ నరేష్(87126 57954) వద్ద పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు, ఏఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.

News October 26, 2025

మెదక్: నేడు స్వగ్రామానికి మృతదేహాలు

image

కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన తల్లీ, కూతురు మృతదేహాలు ఇవాళ రాత్రి వరకు స్వగ్రామానికి రానున్నాయి. మెదక్ మండలం శివాయిపల్లికి చెందిన మంగ సంధ్యారాణి(43), కుమార్తె చందన(23) బస్సు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. DNA పరీక్షల అనంతరం మృతదేహాలను ఇవాళ సాయంత్రం కుటుంబీకులకు అప్పగించారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా శుక్రవారం నుంచి శివ్వాయిపల్లిలో విషాదం నెలకొంది.