News October 26, 2025
ఎంజీఎం: ఇద్దరు చిన్నారులకు ఒకటే సిలిండర్.. కేటీఆర్ ట్వీట్

సర్కారు దవాఖానాలో సరిపోను ఆక్సిజన్ సిలిండర్లు లేక ఇద్దరు చిన్నారులకు ఒకటే సిలిండర్ పెట్టిన దుస్థితి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. పాలన పడకేసి ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ పాలకులేమో కప్పం కట్టడానికి ఢిల్లీ బాట పట్టారని మండిపడ్డారు.
Similar News
News October 26, 2025
భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: WGL కలెక్టర్

భూభారతికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లో వర్ధన్నపేట, దుగ్గొండి మండలాల భూభారతి, పీఓటీ రికార్డులపై ఆమె సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి వెరిఫికేషన్ను వేగవంతం చేయాలని, దరఖాస్తులను తిరస్కరించే పక్షంలో అందుకు స్పష్టమైన కారణాలను తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
News October 26, 2025
కర్నూలు దుర్ఘటన.. చివరి నిమిషంలో బస్సెక్కి మృతి

AP: కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన 19వ వ్యక్తి చిత్తూరు(D)కు చెందిన త్రిమూర్తి అని తేలింది. ఆయన రిజర్వేషన్ లేకున్నా ఆరాంఘర్(HYD)లో బస్సెక్కారు. తన ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి DNA శాంపిల్స్ పరీక్షించగా చనిపోయింది త్రిమూర్తేనని తేలింది. TGకి చెందిన తరుణ్ రిజర్వేషన్ చేసుకున్నా చివరి నిమిషంలో బస్సెక్కకుండా ప్రాణాలు కాపాడుకోగా త్రిమూర్తిని మృత్యువు వెంటాడింది.
News October 26, 2025
కాకినాడ: రామురామంటూనే.. ఎట్టకేలకు తిరిగొచ్చారు.!

తుపాన్ నేపథ్యంలో తాళ్లరేవు మండలం హోప్ ఐలాండ్లో ఉన్న 110 మంది మత్స్యకారులను తీసుకువచ్చేందుకు కాకినాడ ఆర్డీఓ, పోలీసులు సహా 20 మంది అధికారులు ఆదివారం ఉదయం వెళ్లారు. మొదట తాము రామని మత్స్యకారులు చెప్పినా, అధికారులు ఎట్టకేలకు వారికి నచ్చజెప్పారు. సాయంత్రం అందరూ తూరంగిలోని హోప్ ఐలాండ్ కాలనీకి సురక్షితంగా తిరిగి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


