News October 26, 2025
పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

కాట్రేనికోన మండలం బులుసుతిప్ప వద్ద ఉన్న తుపాను పునరావాస కేంద్రాన్ని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం సందర్శించారు. ఈనెల 27, 28, 29వ తేదీల్లో జిల్లాపై తుపాను ప్రభావం ఉన్న నేపథ్యంలో చేపట్టాల్సిన సహాయక చర్యల గురించి ఆయన అధికార యంత్రాంగానికి సూచనలు చేశారు. తీర ప్రాంత ప్రజలకు అందించాల్సిన సహకారంపై ఆయన అధికారులతో చర్చించారు.
Similar News
News October 26, 2025
చంచల్గూడ జైలుకు 150 ఏళ్ల చరిత్ర

చంచల్గూడ జైలు 1876లో నిర్మించబడింది. ఈ జైలుకు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం కాలంలో పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని నేరస్తులుగా ముద్ర వేసి క్రమశిక్షణ పేరుతో అణచివేయడం జరిగేది. నవాబులు తమకు విరోధంగా ఉన్నవారిని ఇక్కడ నిర్బంధించేవారు. అప్పట్లో 70 ఎకరాల్లో విస్తరించిన ఈ జైలు కాలక్రమంలో సంస్కరణలు, నగర విస్తరణ కారణంగా ప్రస్తుతం సుమారు 30 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది.
News October 26, 2025
సిద్దిపేట: ప్రశాంతంగా లైసెన్సుడ్ సర్వేయర్ పరీక్షలు

లైసెన్సుడ్ సర్వేయర్ స్పెల్- 2 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. లైసెన్సుడ్ సర్వేయర్ల కోసం దరఖాస్తు చేసుకుని రెండు నెలల శిక్షణ పొందారు. శిక్షణ అనంతరం ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పరీక్షా సెంటర్ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు.
News October 26, 2025
నవంబర్ 1 నుంచి మధ్యాహ్న భోజనం బంద్: సీఐటీయూ

మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ.10 వేల వేతనం వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలన్నారు. బిల్లులు చెల్లించకుంటే నవంబర్ 1వ తేదీ నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని బంద్ చేస్తామని ఆయన హెచ్చరించారు.


