News October 26, 2025

ఏలూరు జిల్లాకు కాంతిలాల్‌ దండే నియామకం

image

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీర ప్రాంత జిల్లాలకు సీనియర్ అధికారులను నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాకు ప్రత్యేక అధికారిగా కాంతిలాల్ దండే నియమితులయ్యారు. తుఫాను పరిస్థితిని పర్యవేక్షించి, అవసరమైన సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు వీరిని నియామించినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News October 26, 2025

చంచల్‌గూడ జైలుకు 150 ఏళ్ల చరిత్ర

image

చంచల్‌గూడ జైలు 1876లో నిర్మించబడింది. ఈ జైలుకు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం కాలంలో పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని నేరస్తులుగా ముద్ర వేసి క్రమశిక్షణ పేరుతో అణచివేయడం జరిగేది. నవాబులు తమకు విరోధంగా ఉన్నవారిని ఇక్కడ నిర్బంధించేవారు. అప్పట్లో 70 ఎకరాల్లో విస్తరించిన ఈ జైలు కాలక్రమంలో సంస్కరణలు, నగర విస్తరణ కారణంగా ప్రస్తుతం సుమారు 30 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది.

News October 26, 2025

సిద్దిపేట: ప్రశాంతంగా లైసెన్సుడ్ సర్వేయర్ పరీక్షలు

image

లైసెన్సుడ్ సర్వేయర్ స్పెల్- 2 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. లైసెన్సుడ్ సర్వేయర్ల కోసం దరఖాస్తు చేసుకుని రెండు నెలల శిక్షణ పొందారు. శిక్షణ అనంతరం ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పరీక్షా సెంటర్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు.

News October 26, 2025

నవంబర్ 1 నుంచి మధ్యాహ్న భోజనం బంద్: సీఐటీయూ

image

మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ.10 వేల వేతనం వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలన్నారు. బిల్లులు చెల్లించకుంటే నవంబర్‌ 1వ తేదీ నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని బంద్‌ చేస్తామని ఆయన హెచ్చరించారు.