News April 9, 2024
CTR: నిర్మాతలుగా మారిన వైసీపీ నాయకులు

హీరో సాయికుమార్ తనయుడు ఆది హీరోగా షణ్ముఖ సినిమా తీస్తున్నారు. ఈ చిత్రాన్ని చిత్తూరు వైసీపీ నాయకులు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వైసీపీ పాలసముద్రం మండల కన్వీనర్ సప్పని తులసిరామ్, ఆయన సోదరులు షణ్ముగం యాదవ్, రమేశ్ యాదవ్ చిత్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ కూడా షణ్ముగం యాదవ్ కావడం విశేషం. వీళ్లంతా బెంగళూరులో బిల్డర్స్గా రాణిస్తున్నారు.
Similar News
News December 31, 2025
చిత్తూరు: పెన్షనర్లకు గమనిక

చిత్తూరు జిల్లాలోని పెన్షనర్లు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని ట్రెజరీశాఖ DD రామచంద్ర సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ పెన్షన్దారులు వార్షిక జీవన ప్రమాణ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్నారు. జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 28వ తేదీ లోపు లైఫ్ సర్టిఫికెట్లను ఇవ్వాలని.. గడువులోపు సమర్పించకపోతే మార్చి నెల పింఛన్ నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
News December 31, 2025
చిత్తూరు ఎంపీ పనితీరు ఇలా..!

చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద రావు పార్లమెంట్ సమావేశాల్లో 94శాతం అటెండెన్స్ నమోదు చేశారు. ఇటీవల జరిగిన శీతాకాల సమావేశంలో ఏ రోజూ ఆయన పార్లమెంట్కు గైర్హాజరు కాలేదు. హెల్త్ సెక్యూరిటీ సెస్ బిల్లు, బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడారు. 7 చర్చల్లో పాల్గొన్న ఆయన ఇప్పటి వరకు 122 ప్రశ్నలను పార్లమెంట్లో సంధించారు. ఇప్పటి వరకు ఆయన ఎలాంటి ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టలేదు.
News December 31, 2025
చిత్తూరు: CC కెమెరాలతో 152 కేసుల పరిష్కారం

చిత్తూరు జిల్లా పోలీసులు 2025లో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా 152 కేసులను పరిష్కరించారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 755 లొకేషన్లలో 2406 CC కెమెరాలను ఏర్పాటు చేశారు. దొంగతనాలతో పాటు ఇతర నేరాలకు సంబంధించి CC కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం CC కెమెరాల ఏర్పాటుపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.


