News October 26, 2025
SRPT: కాంగ్రెస్ విధేయుడు అన్నెపర్తికే DCC పగ్గాలు?

సూర్యాపేట DCC అధ్యక్ష పదవి తుంగతుర్తికి చెందిన విధేయుడు అన్నెపర్తి జ్ఞానసుందర్కే దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 30-40 ఏళ్లు కాంగ్రెస్ను నమ్ముకుని, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు అండగా ఉంటూ, ప్రజా పోరాటాలు చేయడంలో ముందున్నారు.. పదేళ్లు అధికారం లేకున్నా పార్టీని వీడకుండా పనిచేసిన ఆయనకు పగ్గాలు అప్పగిస్తే కలసివస్తుందని అభిప్రాయపడుతున్నాయి. తుది నిర్ణయం అధిష్ఠానం చేతుల్లో ఉంది.
Similar News
News October 26, 2025
చల్వాయి, గోవిందరావుపేట షాపులకు డ్రా నిలిపివేత..!

ములుగు జిల్లాలోని చల్వాయి, గోవిందరావుపేట మద్యం దుకాణాలకు డ్రాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భూపాలపల్లి ఈఎస్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం భూపాలపల్లి, ములుగు జిల్లాలోని షాపులకు డ్రా జరుగుతోందని, కానీ ప్రోహిబిషన్& ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వులు మేరకు ఈ రెండు దుకాణాలకు డ్రా నిలిపివేసినట్లు వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపారు.
News October 26, 2025
తుఫాన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: మంత్రి అచ్చెన్నాయుడు

మొంథా తుఫాన్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 27, 28, 29వ తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం మన్యం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 26, 2025
కోటబొమ్మాళి: బావిలో స్నానానికి దిగి వ్యక్తి మృతి

కోటబొమ్మాళి మండలం ఉప్పరపేటకు చెందిన దండుపాటి గౌరి నాయుడు ఆదివారం బావిలో పడి మరణించాడు. స్థానికుల వివరాల మేరకు.. గౌరి నాయుడు ఆదివారం బావిలోకి స్నానం చేసేందుకు దిగి అస్వస్థతకు గురయ్యాడు. 108లో ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


