News October 26, 2025
మొంథా తుఫాను పయనమిలా..

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో 8Kmph వేగంతో కదిలిందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి 720km, విశాఖపట్నానికి 790km, కాకినాడకి 780km దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇది 12 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి, ఆరోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది.
Similar News
News February 10, 2026
అప్పుల భారం AP రైతులపైనే ఎక్కువ: కేంద్ర మంత్రి

ఏపీ రైతులపైనే అప్పుల భారం ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ లోక్సభలో తెలిపారు. జులై 2018-జూన్ 2019 మధ్య APలోని ఒక్కో రైతు కుటుంబంపై సగటున రూ.2,35,554 అప్పు ఉందన్నారు. తెలంగాణ రైతుల సగటు అప్పు రూ.1,52,113గా ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల సగటు అప్పు రూ.74,121గా ఉందన్నారు. అప్పుల భారం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ 5వ ప్లేస్లో ఉంది.
News February 10, 2026
మణిపుర్లో మళ్లీ హింస.. 5రోజులు ఇంటర్నెట్ బంద్

మణిపుర్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఉఖ్రుల్ జిల్లా లిటన్ గ్రామంలో తంగ్ఖుల్ నాగా, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. సోమవారం రాత్రి మొదలైన అల్లర్లు మంగళవారానికి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 50 ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. SM ద్వారా తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే వీడియోలు షేర్ అయ్యే ప్రమాదం ఉండటంతో హోం సెక్రటరీ ఇచ్చిన ఆదేశాలతో అధికారులు జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను 5 రోజులు నిలిపేశారు.
News February 10, 2026
మేడారం హుండీ ఆదాయం ఎన్ని కోట్లంటే?

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 828 హుండీలను ఏర్పాటు చేశారు. వారంలోగా వాటన్నింటినీ లెక్కించారు. అన్నింట్లో కలిపి రూ.12,64,67,051 ఆదాయం లభించింది. అలాగే హుండీల్లో 18 దేశాల కరెన్సీ కూడా ఉంది. బంగారు, వెండి అభరణాల లెక్కింపు మాత్రమే మిగిలుంది. గత జాతరలో రూ.13.25 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.12.64 కోట్లు మాత్రమే వచ్చింది.


