News October 26, 2025
NTR: నకిలీ మద్యం కేసు.. కస్టడీ పిటిషన్లపై రేపు విచారణ

నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్టైన ఐదుగురు నిందితుల కస్టడీ పిటిషన్లపై సోమవారం విజయవాడ ఎక్సైజ్ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో A7గా ఉన్న బాదల్దాస్, A8 ప్రదీప్దాస్, A15 రమేశ్, A16 అల్లా భక్షు, A17 సతీశ్బాబులను 10 రోజుల కస్టడీ కోరుతూ అధికారుల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై రేపు విజయవాడ ఎక్సైజ్ కోర్టు విచారణ జరపనున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది.
Similar News
News October 27, 2025
KMR: ‘లిక్కర్ లక్కు’ ఎవరిని వరించనుంది..?

కామారెడ్డి జిల్లాలోని 49 వైన్స్ షాపుల కేటాయింపు కోసం జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో నేడు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. జిల్లాలో ఉన్న 49 వైన్స్ షాపులకు గాను 1502 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ. 45.06 కోట్ల ఆదాయం సమకూరింది. సోమవారం నిర్వహించే లక్కీ డ్రాలో ఎవరి అదృష్టం వరిస్తుందో, మద్యం షాపులు ఎవరికి దక్కుతాయోనని జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
News October 27, 2025
GNT: 39 ఏళ్ల జీవితంలో సుమారు 148 గ్రంథాలను రచించారు.!

ప్రముఖ పండితులు, కవి శిఖామణి బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామంలో జన్మించారు. వీరి 39 సంవత్సరాల జీవితంలో సుమారు 148 గ్రంథాలను రచించారు. వానిలో అష్టకములు, స్తుతులు, అష్టోత్తర శతనామ స్తోత్రాలు, సహస్రనామ స్తోత్రాలు, గద్య స్తోత్రాలు, దండకాలు, శతకాలు, కావ్యాలు, వ్యాఖ్యాన, వ్యాకరణ, వేదాంత గ్రంథాలు మొదలైన అనేక వాజ్మయ ప్రక్రియలు చోటుచేసుకున్నాయి. 27-10-1914 నాడు ఆయన మరణించారు.
News October 27, 2025
పథకాలపై నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తికానున్న సందర్భంగా వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలపై నివేదికలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పెండింగ్లో ఉన్న హామీల అమలుకు ఎంత ఖర్చవుతుంది, ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారమెంత, నిధులను ఎలా సమకూర్చాలి వంటి అంశాలపై రోడ్మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఈ నివేదికల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ప్లాన్ చేసుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.


