News October 27, 2025

పారాది వంతెన వద్ద బందోబస్తు

image

బొబ్బిలి మండలం పారాది వంతెన వద్ద వాహనదారులు ఇబ్బందులు పడకుండా రాత్రి సమయంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాజ్వే పైనుంచి వరదనీరు ప్రవహించడంతో వాహనాలను వంతెన పైనుంచి రాకపోకలకు అనుమతి ఇచ్చారు. వంతెనపై రాత్రి కంటైనర్ లారీ ఉండిపోవడంతో ట్రాఫిక్ ఎస్ఐ జ్ఞానప్రసాద్, కానిస్టేబుల్స్ క్రెయిన్ సహాయంతో లారీని బయటకు తీసి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

Similar News

News October 27, 2025

పంచభూతాల నుంచి నేర్చుకుందాం!

image

జీవితంలో విజయం సాధించడానికి పంచభూతాల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. భూమిలా సహనంతో ధైర్యంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. నీరు మురికిని కడిగినట్టు మంచి మనసుతో నెగటివిటీని దూరం చేయాలి. ఎక్కడా అటాచ్ అవ్వకుండా గాలిలా స్వేచ్ఛగా జీవించాలి. నిప్పులా మీ ఆత్మవిశ్వాసం, శక్తి ప్రకాశవంతంగా వెలగాలి. ఆకాశం దేనికీ కనెక్ట్ అవ్వనట్టు, మనపై పని ఒత్తిడి పడకుండా రిలాక్స్డ్‌గా ఉండాలి. SHARE IT

News October 27, 2025

గద్వాల: ఆన్‌లైన్ చెల్లింపులతో లబ్ధిదారులకు ఆనందం

image

జోగులాంబ గద్వాల్ జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం అమలవుతోంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. బిల్లుల ఆమోదం నుంచి చెల్లింపుల వరకు లబ్ధిదారులు ఏ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ప్రభుత్వం ఆన్‌లైన్ విధానంలో నేరుగా చెల్లింపులు చేయడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News October 27, 2025

HYD: సిట్టింగ్ స్థానం కోసం BRS అడుగులు

image

జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు BRS అడుగులు వేస్తుంది. 3 పర్యాయాలు ప్రాతినిధ్యం వహిస్తున్న జూబ్లీహిల్స్ స్థానం ఎట్టి పరిస్థితిలో చేజారకుండా గట్టి ప్రయత్నాలకు దిగింది. పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, సెంటిమెంట్‌ను నమ్ముకుని రంగంలోకి దిగింది. జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్ట నున్నారో వేచి చూడాల్సిందే.