News October 27, 2025
NLG: కల్లాల్లోనే ధాన్యం.. త్వరగా కొనరే..!

నల్గొండ జిల్లాలో రైతన్నలను కష్టాలు వెంటాడుతున్నాయి. 186 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు మాత్రం వేగంగా జరగడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను ప్రభావం ఉంటుందని వార్తలు వస్తున్నాయని కల్లాల్లోనే ధాన్యం ఉంటే తీవ్రంగా నష్టపోతామంటున్నారు. కాగా జిల్లాలో ఇంకా 150 కేంద్రాలు తెరుచుకోవాల్సి ఉంది. కొన్ని కేంద్రాల్లో కల్లాలలోని ధాన్యం తడవడంతో పాటు వరదకు కొట్టుకుపోయింది.
Similar News
News October 27, 2025
NLG: జిల్లాలో మొంథా అలజడి

జిల్లాలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మొంథా తుపాను ముంచుకొస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలు, ఈదురు గాలులు కారణంగా వందల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. శాలిగౌరారం మండలంలో ఏకంగా రోడ్డు తెలిపోయింది.
News October 27, 2025
NLG: ఆగ మేఘాలతో ఆధార్ అనుసంధానం..!

జిల్లాలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీల అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణకు దిగింది. ఔట్సోర్సింగ్ ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలను ఆధార్ అనుసంధానిస్తున్నారు. దీని ద్వారా క్షేత్రస్థాయిలో పనిచేయకుండానే.. రికార్డుల్లో చూపే వారికి అందే వేతనాలు నిలిచిపోనున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు రెండువేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.
News October 27, 2025
NLG: అదృష్టవంతులు ఎవరో..!

నల్గొండ జిల్లాలో వైన్స్ టెండరుదారుల భవితవ్యం మరికాసేపట్లో తేలనుంది. ఎంతో మంది ఆశావహులు వైన్స్ టెండర్లు దక్కించుకోవాలని ఆశతో ఉన్నప్పటికీ వారి కల నెరవేరుతుందో లేదో అని టెన్షన్ పడుతున్నారు. ఈసారి జిల్లాలో 154 దుకాణాలు ఉండగా.. 4,906 దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తు ఫీజును పెంచడంతో కొందరు గ్రూపులు జతకట్టి దరఖాస్తు చేసుకున్నారు.


