News October 27, 2025
అల్లూరి జిల్లా ఇన్ఛార్జ్గా వీ.వినయ్ చంద్

మొంథా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లాలకు ఇన్ ఛార్జులను నియమించింది. ఇందులో భాగంగా అల్లూరి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి వీ.వినయ్ చంద్ను ఇన్చార్జిగా నియమిస్తూ ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది. తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు, ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు చేపట్టడంపై వీ.వినయ్ చంద్ జిల్లా ఇన్చార్జిగా బాధ్యతలను నిర్వహిస్తారు.
Similar News
News October 27, 2025
సంగారెడ్డి: వైజ్ఞానిక ప్రదర్శన పోటీలకు సిద్ధంకండి: జిల్లా సైన్స్ అధికారి

ఇన్స్పైర్ మనక్ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు నవంబర్ రెండో వారంలో జరుగుతాయని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి సోమవారం తెలిపారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రయోగాలు తయారు చేయాలని ఆయన కోరారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.
News October 27, 2025
వేరుశనగ వరద ముంపునకు గురైతే ఏం చేయాలి?

సాధ్యమైనంత వేగంగా పొలం నుంచి నీటిని తీసివేయాలి. ఈ సమయంలో టిక్కా ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. దీన్ని గుర్తిస్తే 200 లీటర్ల నీటిలో టెబుకోనజోల్ 200ml లేదా హెక్సాకొనజోల్ 400ml కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చు పురుగుల నివారణకు లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 0.4ml కలిపి పిచికారీ చేయాలి. ఐరన్ లోపం కనిపిస్తే లీటరు నీటికి ఫెర్రస్ సల్ఫేట్ 5గ్రా.తో పాటు సిట్రిక్ యాసిడ్ 1గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News October 27, 2025
మరోసారి భారత్ను రెచ్చగొట్టిన బంగ్లా చీఫ్

బంగ్లా చీఫ్ యూనస్ మరోసారి భారత్ను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. పాక్ ఆర్మీ జనరల్కు ఆయన ప్రజెంట్ చేసిన బుక్ దుమారం రేపింది. ఆ బుక్ కవర్ పేజీపై అస్సాం సహా ఇతర నార్త్ఈస్ట్ రాష్ట్రాలను బంగ్లాలో భాగంగా చూపారు. ర్యాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్స్ డిమాండ్ చేస్తున్న ‘గ్రేటర్ బంగ్లాదేశ్’కు యూనస్ మద్దతిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కొంతకాలంగా ఆయన నార్త్ఈస్ట్ స్టేట్స్పై అభ్యంతరకర కామెంట్స్ చేయడం తెలిసిందే.


