News October 27, 2025
CM చంద్రబాబు పల్నాడు పర్యటన షెడ్యూల్ ఇదే.!

CM చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా నేడు పల్నాడు (D) వెల్దుర్తి రానున్నారు. షెడ్యూల్ను CM కార్యాలయం విడుదల చేసింది. ఉదయం 10.15 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 10:30కి ఏపీ సచివాలయానికి చేరుకుంటారు. 11. 55 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 12 గంటలకు హెలికాప్టర్లో వెల్దుర్తి బయలుదేరతారు. ఒంటి గంటకు MLA తనయుడి వివాహ రిసెప్షన్లో పాల్గొని 1.10కి తిరిగి హెలికాప్టర్లో అమరావతి బయలుదేరతారు.
Similar News
News October 27, 2025
RGM: 1,000 మంది విద్యార్థులతో ఓపెన్ హౌస్..!

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సుమారు 1,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోలీస్ విధులు, షీ టీమ్స్, భరోసా, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. డాగ్ స్క్వాడ్ ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. సైబర్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు.
News October 27, 2025
నేరస్థులను తరలించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి: CP

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు 86 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామని, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. పీడీ యాక్ట్, రౌడీ హిస్టరీ షీటర్లకు ఠాణాల్లో కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. నేరస్థులను ఠాణాలకు తరలించేటప్పుడు పోలీసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News October 27, 2025
అసలైన భక్తులకు ప్రతిదీ దైవమే!

సమస్త జీవుల్లో దేవుణ్ని చూస్తూ, వాటిని సంతోషపెట్టడమే నిజమైన ఈశ్వర పూజ. మనసులో భగవంతుణ్ని స్థాపించుకున్న భక్తులు ఉన్నత స్థితికి చేరుకుంటారు. స్థిరమైన, అవిచ్ఛిన్నమైన భక్తిని కలిగి ఉంటారు. అలాంటి భక్తులు తమ పనులన్నింటినీ భగవత్ సేవగానే భావించి, అంకితభావంతో చేస్తాడు. అందువల్ల వారికి వేరే ధ్యానం, ఆరాధన కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉండదు. అతని ప్రతి కర్మ నిరంతర పూజగా మారుతుంది.<<-se>>#Daivam<<>>


