News October 27, 2025
పాలమూరు: కొత్త మద్యం లైసెన్స్ దారులు ఎవరు? నేడు లక్కీడిప్

ఉమ్మడి జిల్లాలోని 227 మద్యం దుకాణాలకు కొత్త లైసెన్స్ దారులు ఎవరో నేడు తేలనుంది. మొత్తం 5,536 మంది టెండర్లు దాఖలు చేయగా, వారిలో 227 మందిని లక్కీడిప్ ద్వారా ఎంపిక చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఆయా కలెక్టరేట్లలో లక్కీడిప్ నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల లక్కీడిప్ను మహబూబ్నగర్ కలెక్టరేట్లో నిర్వహిస్తారు.
Similar News
News October 27, 2025
చోది మేళ్లలొ చోరీ.. రూ.15 లక్షల సొత్తు అపహరణ

ఇంటికి తాళం వేసి గుడికి వెళ్లి తిరిగొచ్చేసరికి తాళాలు పగులగొట్టి దుండగులు చోరీ చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. చోదిమెళ్లకి చెందిన బాధితుడు వేమూరి అనంతరామ్ వివరాల మేరకు.. తాను తన కుటుంబంతో కలిసి 26న పుణ్యక్షేత్రానికి వెళ్లాడు. తిరిగి సోమవారం వచ్చి చూడగా, తలుపు తాళాలు, బీరువా ధ్వంసమై ఉన్నారు. సుమారు రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి చోరీకి గురైందన్నారు. క్లూస్టీం వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.
News October 27, 2025
RGM: 1,000 మంది విద్యార్థులతో ఓపెన్ హౌస్..!

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సుమారు 1,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోలీస్ విధులు, షీ టీమ్స్, భరోసా, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. డాగ్ స్క్వాడ్ ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. సైబర్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు.
News October 27, 2025
నేరస్థులను తరలించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి: CP

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు 86 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామని, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. పీడీ యాక్ట్, రౌడీ హిస్టరీ షీటర్లకు ఠాణాల్లో కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. నేరస్థులను ఠాణాలకు తరలించేటప్పుడు పోలీసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


