News October 27, 2025
ADB: ఆర్టీసీ బస్సుల్లో క్యాష్ లెస్ పేమెంట్స్

టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. ఇదివరకు సూపర్ లగ్జరీ, గరుడ, రాజధాని బస్సుల్లో మాత్రమే టికెట్ల కోసం ఆన్లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేసేవారు. ప్రస్తుతం ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా డిజిటల్ చెల్లింపులకు అవకాశం లభించింది. ADB- NRML-NZB రూట్లలో ఎక్స్ప్రెస్ బస్సులో ఆన్లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. త్వరలో అన్ని బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
Similar News
News October 27, 2025
ఆలస్యంగా ప్రెగ్నెంట్ అయితే..

మహిళల్లో గర్భధారణ ఆలస్యమైతే పిల్లల్లో ‘డౌన్స్ సిండ్రోమ్ రిస్క్’ పెరుగుతుంది. 25ఏళ్ల వయసులో ప్రెగ్నెంటయితే 1250 మందిలో ఒకరికి, 30ఏళ్లలో 1000 మందిలో ఒకరికి, 35ఏళ్లలో 400 మందిలో ఒకరికి, 40ఏళ్లలో 100 మందిలో ఒకరికి, 45ఏళ్లలో 30 మందిలో ఒకరికి రిస్క్ ఉంటుంది. పిల్లల్లో శారీరక, మానసిక లోపాలుంటాయి. దీన్ని గుర్తించడానికి ట్రిపుల్ స్క్రీన్ పరీక్ష చేయించాలి. #ShareIt
* ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.
News October 27, 2025
HYD: ఎన్నికల ఖర్చులు తనిఖీ చేయనున్న అధికారులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు తమ ఖర్చులు నమోదుచేసే రిజిస్టర్లను అధికారులు రేపు తనిఖీ చేయనున్నారు. పోటీలో ఉన్న 58 మంది అభ్యర్థులు తప్పని సరిగా చెక్ చేయించుకోవాలని ఎన్నికల పరిశీలకుడు సంజీవ్ కుమార్ లాల్ తెలిపారు. రేపటితోపాటు మరో 2 పర్యాయాలు (నవంబర్ 3, 9) రిజిస్టర్లను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు.
News October 27, 2025
మాజీ మేయర్ హత్య కేసు తీర్పు 30కి వాయిదా

మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో న్యాయస్థానం దోషుల వాదనలు వినింది. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు తుది తీర్పు వెలువరించనున్నట్లు జడ్జి ప్రకటించారు. ఆ రోజున దోషులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.


