News October 27, 2025
‘ఇంతకీ జూబ్లీహిల్స్లో ఏం అభివృద్ధి చేస్తారంట’

తెలంగాణలో ఖరీదైన ఏరియా అంటే జూబ్లీహిల్స్ గుర్తొస్తుంది. ఇక్కడ లేని షాపింగ్ మాల్ లేదు. తిరగని సెలబ్రెటీ ఉండరు. కొండ ప్రాంతం ఎవరి ఊహలకు అందనంత అభివృద్ధి చెందింది. బైపోల్ సందర్భంగా జూబ్లీహిల్స్ అభివృద్ధి తమ పార్టీలతోనే సాధ్యమని నేతలు అంటున్నారు. పొరుగు రాష్ట్రాలు తమ ప్రాంతాన్ని జూబ్లీహిల్స్ అంత అభివృద్ధి చేస్తామని చెబుతుంటే, కొత్తగా ఇక్కడ ఏంఅభివృద్ధి చేస్తారో చెప్పకపోవడం ఓటర్లకు అంతుచిక్కని ప్రశ్న.
Similar News
News October 27, 2025
HYD: చిన్న శ్రీశైలం సహా 99 మంది బైండోవర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్తో కలిపి 100 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. నవీన్ యాదవ్ ర్యాలీలో రౌడీ షీటర్లు పాల్గొన్నారన్న ఆరోపణలతో EC ఆదేశాల మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. బోరబండలో 74 మంది, మధురానగర్లో చిన్న శ్రీశైలం సోదరుడితో పాటు 19 మంది బైండోవర్ అయ్యారు. ఎన్నికల వేళ నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
News October 27, 2025
HYD: ఎన్నికల ఖర్చులు తనిఖీ చేయనున్న అధికారులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు తమ ఖర్చులు నమోదుచేసే రిజిస్టర్లను అధికారులు రేపు తనిఖీ చేయనున్నారు. పోటీలో ఉన్న 58 మంది అభ్యర్థులు తప్పని సరిగా చెక్ చేయించుకోవాలని ఎన్నికల పరిశీలకుడు సంజీవ్ కుమార్ లాల్ తెలిపారు. రేపటితోపాటు మరో 2 పర్యాయాలు (నవంబర్ 3, 9) రిజిస్టర్లను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు.
News October 27, 2025
జూబ్లీ బైపోల్స్: కీలకం కానున్న సినీ కార్మికులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సినీ కార్మికుల ఓట్లు కీలకం కానున్నాయి. షేక్పేట, బోరబండ, కృష్ణానగర్, యూసుఫ్గూడ, రహ్మత్నగర్, శ్రీనగర్కాలనీ, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో దాదాపు 24 వేల మంది సినీ కార్మికులున్నారు. దీంతో అభ్యర్థులు సినీ కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయపడుతున్నారు. అందుకే సినీ ప్రముఖుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సుమన్ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారు.


