News October 27, 2025
సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ గడువు పొడిగింపు

ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్షిప్ని అందిస్తోంది. 10th పాసై ప్రస్తుతం సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో 11th చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. పదోతరగతిలో 70%మార్కులు వచ్చి ఉండాలి. తాజాగా దరఖాస్తు గడువు తేదీని నవంబర్ 20 వరకు పొడిగించారు.
వెబ్సైట్: <
Similar News
News October 27, 2025
కోర్టు విచారణలు AIతో చకచకా

కోర్టుల్లో లక్షల కేసులు ఏళ్లపాటు పెండింగ్లో ఉంటున్నాయి. ఇందుకు అనేక కారణాల్లో సిబ్బంది, వనరుల కొరత ఒకటి. దీనికి AI చక్కటి పరిష్కారం చూపుతోంది. ఇప్పటికే దేశంలోని 4వేల కోర్టులు AIని అడాప్ట్ చేసుకొని న్యాయప్రక్రియను స్పీడప్ చేస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు లాయర్లు రూపొందించిన ‘అదాలత్ ఏఐ’ టూల్ కోర్టు రూమ్ రూపాన్ని మార్చేస్తోంది. స్టెనో, టైపిస్టులతో పనిలేకుండా రియల్ టైమ్లో ప్రొసీడింగ్స్ ఇస్తోంది.
News October 27, 2025
డబుల్ సెంచరీ బాదిన పృథ్వీ షా

యంగ్ ప్లేయర్ పృథ్వీ షా రంజీలో డబుల్ సెంచరీ బాదారు. ఛత్తీస్గఢ్తో జరుగుతున్న మ్యాచ్లో మహారాష్ట్ర తరఫున 144 బంతుల్లోనే 200 మార్క్ దాటారు. ఇది రంజీ హిస్టరీ ఎలైట్ గ్రూప్లో సెకండ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కావడం విశేషం. 29 ఫోర్లు, 5 సిక్సర్లతో 156 బంతుల్లో 222 రన్స్ చేశారు. ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమితో జాతీయ జట్టుకు దూరమైన షా దేశవాళీల్లో రాణిస్తున్నారు.
News October 27, 2025
BC ఓటు బ్యాంకుపైనే RJD గురి

బిహార్ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ప్రధాన పోటీ NDA, MGBల మధ్యే ఉంది. మహాఘట్బంధన్లో కీలకమైన RJD BC ఓట్లపై గురిపెట్టింది. పోటీచేస్తున్న143 స్థానాల్లో 51% సీట్లు BCలకు కేటాయించింది. ఇందులో 53సీట్లు యాదవులవే. EBCలకు 11% ముస్లింలకు 13% అగ్రవర్ణాలకు 10% సీట్లు ఇచ్చింది. గత ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండడంతో ఈబీసీల సంఖ్య ఈసారి తగ్గించి బీసీలకు ప్రాధాన్యమిచ్చింది.


