News October 27, 2025
అమరావతికి ‘వైకుంఠపురం’ రక్షణ కవచం

రాజధాని అమరావతికి వైకుంఠపురం ఒక పెద్ద రక్షణ కవచంగా పనిచేస్తుంది. కృష్ణా నది వరద సమయంలో పడమర నుంచి తూర్పు దిశగా ప్రవహించి, వైకుంఠపురంలోని కొండ దగ్గర తన దిశను ఉత్తరం వైపునకు మార్చుకుంటుంది. ఉత్తర, దక్షిణ దిక్కులలో ఉన్న కరకట్టల కారణంగా వరద నీరు వైకుంఠపురంలోకి రాదు. ఒకవేళ వరద నీరు గ్రామంలోకి వస్తే, రాజధానిలోని గ్రామాలు ముంపునకు గురవడమే కాక, కొట్టుకుపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
Similar News
News October 27, 2025
NMDCలో 197 పోస్టులు

ఛత్తీస్గఢ్ దంతేవాడలోని NMDC 197 అప్రెంటిస్ల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ITI, డిప్లొమా, డిగ్రీ లేదా ఫార్మసీ సైన్స్/ BBA ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. ట్రేడ్ అప్రెంటిస్లు ముందుగా apprenticeshipindia.gov.in/లో, గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్లు nats.education.gov.in/లో ఎన్రోల్ చేసుకోవాలి. NOV 12 – 21 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తుంది. వెబ్సైట్: https://www.nmdc.co.in/
News October 27, 2025
మొంథా తుపాన్పై జీవీఎంసీ అప్రమత్తం

మొంథా తుపాన్ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్లు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. నగరంలో 55 పునరావాస కేంద్రాలు, 20 క్విక్ రెస్పాన్స్ టీమ్లు ఏర్పాటయ్యాయి. 29 జేసీబీలు, 82 స్ప్రేయర్లు, 64 ఫాగింగ్ మెషిన్లు, 26 ట్రీ కట్టర్లు సిద్ధంగా ఉంచారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, జోన్లలో కంట్రోల్ రూములు 24 గంటలు పనిచేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు.
News October 27, 2025
పండుగ రోజుల్లో పకోడీలు తింటున్నారా?

పండుగంటే దైవారాధనలో నిమగ్నమవ్వడం. ఇలాంటి పవిత్రమైన రోజుల్లో పకోడీలు తినడం వల్ల మనస్సు చంచలానికి గురై, నిగ్రహం కోల్పోయే అవకాశం ఉంటుంది. పకోడీల్లో వేసే ఉల్లిపాయలకు తామసిక గుణాన్ని(ఉత్తేజాన్ని) పెంచే శక్తి ఉంటుంది. అందుకే పండుగ రోజున వీటిని తినకూడదని పండితులు చెబుతున్నారు. పర్వదినాల్లో భగవద్భక్తి, ప్రశాంతత ప్రధానం కాబట్టి ఇలాంటి ఆహారాన్ని దూరం ఉంచి, ఆ రోజును ఆధ్యాత్మిక నిష్ఠతో గడపాలని అంటున్నారు.


