News October 27, 2025
మొంథా తుఫాన్.. విద్యుత్ శాఖ నుంచి కీలక ప్రకటన

మొంథా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో NTR జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఉప్పలపాటి హనుమయ్య సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
విజయవాడ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయం: 9440817561
విజయవాడ టౌన్ డివిజన్ కార్యాలయం: 7382623226
గుణదల డివిజన్: 6281703087
విజయవాడ రూరల్: 6281705138
నూజివీడు డివిజన్:8125533788.
Similar News
News October 27, 2025
NMDCలో 197 పోస్టులు

ఛత్తీస్గఢ్ దంతేవాడలోని NMDC 197 అప్రెంటిస్ల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ITI, డిప్లొమా, డిగ్రీ లేదా ఫార్మసీ సైన్స్/ BBA ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. ట్రేడ్ అప్రెంటిస్లు ముందుగా apprenticeshipindia.gov.in/లో, గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్లు nats.education.gov.in/లో ఎన్రోల్ చేసుకోవాలి. NOV 12 – 21 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తుంది. వెబ్సైట్: https://www.nmdc.co.in/
News October 27, 2025
మొంథా తుపాన్పై జీవీఎంసీ అప్రమత్తం

మొంథా తుపాన్ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్లు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. నగరంలో 55 పునరావాస కేంద్రాలు, 20 క్విక్ రెస్పాన్స్ టీమ్లు ఏర్పాటయ్యాయి. 29 జేసీబీలు, 82 స్ప్రేయర్లు, 64 ఫాగింగ్ మెషిన్లు, 26 ట్రీ కట్టర్లు సిద్ధంగా ఉంచారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, జోన్లలో కంట్రోల్ రూములు 24 గంటలు పనిచేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు.
News October 27, 2025
పండుగ రోజుల్లో పకోడీలు తింటున్నారా?

పండుగంటే దైవారాధనలో నిమగ్నమవ్వడం. ఇలాంటి పవిత్రమైన రోజుల్లో పకోడీలు తినడం వల్ల మనస్సు చంచలానికి గురై, నిగ్రహం కోల్పోయే అవకాశం ఉంటుంది. పకోడీల్లో వేసే ఉల్లిపాయలకు తామసిక గుణాన్ని(ఉత్తేజాన్ని) పెంచే శక్తి ఉంటుంది. అందుకే పండుగ రోజున వీటిని తినకూడదని పండితులు చెబుతున్నారు. పర్వదినాల్లో భగవద్భక్తి, ప్రశాంతత ప్రధానం కాబట్టి ఇలాంటి ఆహారాన్ని దూరం ఉంచి, ఆ రోజును ఆధ్యాత్మిక నిష్ఠతో గడపాలని అంటున్నారు.


