News October 27, 2025

RAC సీట్లకు సగం ఛార్జీలు తిరిగి చెల్లించాలని డిమాండ్!

image

రైళ్లలో RAC ఛార్జీలపై ప్రయాణికులు SM వేదికగా విమర్శలు చేస్తున్నారు. సగం సైడ్ లోవర్ బెర్త్‌కు పూర్తి ఛార్జీ వసూలు చేయడం అన్యాయమని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు నిద్ర లేకుండా ప్రయాణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చార్ట్ తయారైన వెంటనే RAC ప్రయాణికులకు సగం డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని అమలు చేయాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌ను కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News October 27, 2025

ప్రజాభిప్రాయ సేకరణలో మెరుగైన శాతాన్ని సాధించాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో మెరుగైన శాతాన్ని సాధించాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై ప్రజల నుంచి సేకరిస్తున్న అభిప్రాయ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ అభిప్రాయాలను సేకరించాలన్నారు. రాష్ట్రంలోనే మెరుగైన శాతాన్ని సాధించాలన్నారు.

News October 27, 2025

దేశంలోనే మొట్టమొదటి మహిళా అశ్విక దళం

image

హైదరాబాద్ పోలీసులు దేశంలోనే మొట్టమొదటి మహిళా అశ్విక దళాన్ని ఏర్పాటు చేశారు. గుర్రపుస్వారీలో శిక్షణపొంది, మెరికల్లా తయారై సిటీమౌంటెడ్‌ పోలీస్‌ విభాగంలో భాగమయ్యారు 9మంది మహిళా కానిస్టేబుళ్లు. వీరంతా 2024 ఆర్డ్మ్‌ రిజర్వ్‌ బ్యాచ్‌కి చెందిన వాళ్లు. వీరికి గుర్రపుస్వారీలో 6నెలల పాటు శిక్షణ ఇప్పించి విధులను అప్పగించారు. మంచి శిక్షణ ఇస్తే తామూ ఎందులోనూ తీసిపోమని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారీ నారీమణులు.

News October 27, 2025

పోలింగ్‌లో పైచేయి… అయినా గెలిచేది తక్కువే…

image

BIHAR ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళల ఓటింగ్ శాతమే ఎక్కువ. అయితేనేం పోటీలో ఉండే స్త్రీలు గెలిచేది మాత్రం చాలా స్వల్పం. అంటే వారి ఓట్లు పురుష అభ్యర్థులకే ఎక్కువ పడుతున్నాయన్న మాట. స్త్రీకి స్త్రీయే శత్రువంటే ఇదేనేమో. 2005లో 24(234మందికి), 2010లో 34(307), 2020లో 26(370) మంది మాత్రమే గెలిచారు. 2020లో పోలింగ్ శాతం ఉమెన్ 59.69%, మెన్ 54.45%గా ఉంది. 2015లో అత్యధికంగా 60.48% స్త్రీల ఓట్లు పోలయ్యాయి.