News October 27, 2025
వేరుశనగ వరద ముంపునకు గురైతే ఏం చేయాలి?

సాధ్యమైనంత వేగంగా పొలం నుంచి నీటిని తీసివేయాలి. ఈ సమయంలో టిక్కా ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. దీన్ని గుర్తిస్తే 200 లీటర్ల నీటిలో టెబుకోనజోల్ 200ml లేదా హెక్సాకొనజోల్ 400ml కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చు పురుగుల నివారణకు లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 0.4ml కలిపి పిచికారీ చేయాలి. ఐరన్ లోపం కనిపిస్తే లీటరు నీటికి ఫెర్రస్ సల్ఫేట్ 5గ్రా.తో పాటు సిట్రిక్ యాసిడ్ 1గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
Similar News
News October 27, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో 19 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ, డిగ్రీ, ఎండీ(రేడియాలజీ), ఎంబీబీఎస్, డీఎన్బీ, బీఎస్సీ(నర్సింగ్), డిప్లొమా(నర్సింగ్), ఇంటర్, DMLT, టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్సైట్: https://www.nia.nic.in/
News October 27, 2025
ఇతిహాసాలు క్విజ్ – 48 సమాధానాలు

1. హనుమంతుడి గురువు ‘సూర్యభగవానుడు’.
2. వ్యాసుని తల్లి ‘సత్యవతి’.
3. కుబేరుడి వాహనం ‘నరుడు’.
4. కామదహనం జరిగే పండుగ ‘హోళి’.
5. ఇంద్రుని వజ్రాయుధం చేసింది ‘దధీచి మహర్షి’.
<<-se>>Ithihasaluquiz<<>>
News October 27, 2025
అన్నదాత సుఖీభవ.. ఆ రైతులకు గుడ్ న్యూస్

AP: వెబ్ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ తప్పుల వల్ల ‘అన్నదాత సుఖీభవ’ పథకం 5.44L మంది రైతులకు ఆగిపోయింది. వీటిలో ప్రతి సవరణకు మీ సేవా కేంద్రాల్లో రూ.50 ఛార్జ్ ఉంది. అయితే పథకం ఆగిపోయిన అన్నదాతలంతా ఒకసారి ఉచితంగా సవరణ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకోసం మీసేవా ఛార్జీలు రూ.2.72 కోట్లను మాఫీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
* రోజూ రైతులకు సంబంధించిన సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


