News October 27, 2025

జగిత్యాల: పంట కొనుగోళ్లపై సందేహాలున్నాయా..?

image

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతునేస్తం కార్యక్రమాన్ని రేపు ఉ.10 నుంచి 11 గం.ల వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై మార్కెటింగ్, మార్క్‌ ఫెడ్, ECCI అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లా రైతులు తమ సమీప రైతువేదికల్లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని పంట కొనుగోళ్లపై ఉన్న సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు.

Similar News

News October 27, 2025

విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎండీ 

image

తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. హన్మకొండలో 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వర్షాల వల్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News October 27, 2025

బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలి: నల్గొండ SP

image

ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌ డే సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 55 మంది అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News October 27, 2025

ప్రతిపక్షంలో BRS.. 97.4% తగ్గిపోయిన విరాళాలు

image

TG: అధికారం కోల్పోగానే BRSకు వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయాయి. ఈసీకి BRS సమర్పించిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం 2024–25లో రూ.15.09 కోట్లు మాత్రమే విరాళాలుగా వచ్చాయి. ప్రోగ్రెసివ్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ నుంచి ₹10 కోట్లు, ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ నుంచి ₹5 కోట్లు అందాయి. 2023–24లో ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా కారు పార్టీకి రూ.580.52 కోట్లు రాగా ఈసారి ఏకంగా 97.4% తగ్గిపోవడం గమనార్హం.