News October 27, 2025

HYD: డీప్‌ఫేక్ కేసులో విచారిస్తున్నాం: సీపీ

image

మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు మెగాస్టార్ చిరంజీవి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ స్పందిస్తూ.. చిరంజీవి డీప్‌ఫేక్ కేసులో విచారణ చేస్తున్నామని, సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసే కేటుగాళ్లపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేస్తామన్నారు.

Similar News

News October 27, 2025

లోతట్టు ప్రాంతాల్లో కూరగాయల పంపిణీ

image

మొంథా తుఫాను నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా 15 మొబైల్‌ వాహనాల ద్వారా కూరగాయలను విక్రయించే ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్ల తెలిపారు. జిల్లా మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ఈ మొబైల్‌ వాహనాలను పంపి ప్రజలకు నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

News October 27, 2025

ఇది మోదీ, ఈసీల బహిరంగ ఓట్ల దొంగతనం: కాంగ్రెస్

image

EC ప్రకటించిన రెండో దశ <<18119730>>SIR<<>>పై కాంగ్రెస్ మండిపడింది. 12 రాష్ట్రాలు, UTల్లో ఓట్ చోరీ ఆట ఆడేందుకు EC సిద్ధమైందని విమర్శించింది. బిహార్‌లో 69 లక్షల ఓట్లను తొలగించిందని, ఇప్పుడు కోట్ల ఓట్లను డిలీట్ చేసేందుకు రెడీ అవుతోందని ఆరోపించింది. ఇది మోదీ, ఈసీ కలిసి చేస్తున్న బహిరంగ ఓట్ల దొంగతనమని ట్వీట్ చేసింది. మరోవైపు SIRను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేరళ సీఎం విజయన్, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు.

News October 27, 2025

హైదరాబాద్ సిటీ పోలీసుల మెగా రక్తదాన శిబిరం

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీసులు సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 12 జోన్లలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 3,500 మంది దాతలు రక్తం ఇచ్చారు. థలసేమియా రోగుల కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. అమరవీరుల త్యాగానికి ఇది నివాళి. తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. “రక్తదానం ప్రాణదానంతో సమానం” అని తెలిపారు. పోలీసులు, పౌరులు ఇందులో పాల్గొన్నారు.