News October 27, 2025

యాదాద్రి: ప్రభుత్వ కార్యాలయాలకు మంత్రి శంకుస్థాపన

image

మోటకొండూర్ మండల కేంద్రంలో నిర్మించనున్న నూతన MRO, MPP కార్యాలయాల నిర్మాణాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసం మెరుగైన వసతులతో కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 27, 2025

MHBD: ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

image

రైతులు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. రానున్న రెండు రోజుల్లో రాష్ట్ర వాతావరణ సూచనల మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వ్యవసాయ, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, సంబంధిత విభాగాల అధికారులతో కలెక్టర్ టెలిఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించి తగిన సూచనలు చేసి ఆదేశాలు జారీ చేశారు.

News October 27, 2025

ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలని నిర్మలారెడ్డి వినతి

image

సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ టీజీఐఐసీ ఛైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డి సోమవారం కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల పాఠశాల, కళాశాలను సందర్శించినప్పుడు సమస్యల పరిష్కారానికి రూ.1.30 కోట్లతో ప్రతిపాదన తయారు చేయించినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామ్ రెడ్డి, కూన సంతోష్ పాల్గొన్నారు.

News October 27, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి: భద్రాద్రి కలెక్టర్

image

తెలంగాణ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, సమర్థవంతంగా కొనుగోలు కొనసాగుతున్నదని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కనీస మౌలిక వసతులు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్ కవర్లు అన్ని కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.