News October 27, 2025
ANU పరిధిలోని కాలేజీలకు సెలవు

గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మొంథా తుఫాను నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలకు ఈ నెల 29 వరకు మూడు రోజుల సెలవులు ప్రకటిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం తెలిపారు. ఈ ఆదేశాలను తప్పక పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Similar News
News October 27, 2025
గుంటూరు జిల్లాలో పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే

మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం పోలీస్ (24×7) కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు చేసిందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
@జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0863-2230100
@ఈస్ట్ సబ్డివిజన్–0863-2223353
@వెస్ట్ సబ్డివిజన్– 0863-2241152 / 0863-2259301
@నార్త్ సబ్డివిజన్–08645-237099
@సౌత్ సబ్డివిజన్–0863-2320136
@తెనాలి సబ్డివిజన్–08644-225829
@తుళ్లూరు సబ్డివిజన్–08645-243265
News October 27, 2025
ANU: పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీజీ ఆర్ట్స్, సైన్స్ కోర్సుల మూడో సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లై) పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షలు నవంబర్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫీజు చెల్లింపుకు చివరి తేది నవంబర్ 3, రూ.100 జరిమానాతో నవంబర్ 6 వరకు అవకాశం. గ్యాలీలు నవంబర్ 4లోపు సమర్పించాలి. ఆన్లైన్ ద్వారా ఇంటర్నల్స్/మూక్లు/ప్రాక్టికల్ మార్కులను సమర్పించడానికి చివరి తేదీ: 15-12-2025
News October 27, 2025
గుంటూరు జిల్లా నిరుద్యోగులకు ముఖ్య గమనిక

జర్మనీలో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాల కోసం మైనారిటీ యువతకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అవకాశం కల్పిస్తోంది. ఏపీఎస్ఎస్డీసీ, ఓఎంసీఏపీ, ఐఈఎస్ సంయుక్తంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఐటీఐ, డిప్లొమా అర్హతతో పాటు కనీసం 2 ఏళ్ల అనుభవం, వయస్సు 30 లోపు ఉండాలని అధికారులు తెలిపారు. మొత్తం ఖర్చు రూ.1.15 లక్షలు 3 వాయిదాల్లో చెల్లించాలి. ఆసక్తిగల వారు నవంబర్ 2లోపు naipunuam.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


