News October 27, 2025
కృష్ణా: తుపాను నేపథ్యంలో.. ఈ జాగ్రత్తలు తీసుకున్నారా..?

తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. పిల్లలకు పాలు, అవసరమైన వస్తువులు, నిత్యవసర సరుకులు కూరగాయలు సిద్ధం చేసుకోవాలి. విద్యుత్ అంతరాయం కలిగినా తుపాను అప్డేట్స్ తెలుసుకునేందుకు సెల్ ఫోన్స్ చార్జింగ్, ఇంట్లో వాటర్ ట్యాంకర్లు నిండుగా ఉంచుకోవాలి.
Similar News
News October 28, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 28, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.00 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.10 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
✒ ఇష: రాత్రి 7.00 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 28, 2025
కృష్ణపట్నం పోర్టులో 5వ ప్రమాదపు హెచ్చరిక జారీ

‘మెంథా’ తుఫాన్ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో సోమవారం సాయంత్రం 5వ ప్రమాదవ హెచ్చరిక ప్రకటన చేశారు. తుపాను 50 నుంచి 150 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు 5, 6వ నంబరు ప్రమాదకర సూచికలుగా పరిగణిస్తారు. గాలులు, అలలు పోర్ట్ పరిసరాల్లో ప్రభావం చూపుతాయని అర్థం. ఈ నంబర్ల హెచ్చరికలు జారీచేస్తే పోర్టులో కార్యకలాపాలన్నీ నిలిపేయాలి. కృష్ణపట్నం పోర్టులో కార్మికులకు సెలవు ఇవ్వకపోవడంపై పలువురు మండిపడుతున్నారు
News October 28, 2025
చిత్తూరు జిల్లాలో నేడు కూడా స్కూళ్లకు సెలవు

చిత్తూరు జిల్లాలో అన్ని స్కూళ్లకు మంగళవారం సైతం సెలవును ప్రకటించినట్లు DEO వరలక్ష్మి తెలిపారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు గమనించాలని కోరారు.


