News October 27, 2025
సిద్దిపేట ప్రజావాణికి 168 దరఖాస్తులు

ప్రజావాణిలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కాగా నేడు మొత్తం 168 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News October 28, 2025
వనపర్తి: మద్యం దుకాణాల లక్కీడిప్.. దంపతులకు బంపర్ లక్కు

వనపర్తి జిల్లాలో మొత్తం 36 మద్యం దుకాణాల కోసం 757 దరఖాస్తులు రాగా, పాన్గల్ మండలం వెంగలాయిపల్లి చెందిన దంపతులు గండం ప్రవీణ కుమారి, మొగిలి సురేష్ కుమార్లకు అదృష్టం వరించింది. ప్రవీణ కుమారికి గౌడ్ రిజర్వేషన్లో పాన్గల్-2 దుకాణం దక్కగా, సురేష్ కుమార్ గౌడ్కు ఓపెన్ కేటగిరీలో కొత్తకోట-3 దుకాణం లభించింది. ఒకే కుటుంబానికి 2 దుకాణాలు దక్కడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
News October 28, 2025
హరీశ్రావు తండ్రి మరణం బాధాకరం: ‘X’లో సీఎం

మాజీ మంత్రి, సిద్ధిపేట MLA హరీశ్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి Xలో వేదికగా పోస్ట్ చేశారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్రావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని రాసుకొచ్చారు.
News October 28, 2025
శ్రీరాంపూర్: ‘సింగరేణి మాజీ ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి’

సీపీఆర్ఎంఎస్ స్కీమ్లో సభ్యత్వం ఉన్న సింగరేణి మాజీ ఉద్యోగులు నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని సంస్థ జీఎం (పర్సనల్) జీవీకే కుమార్ తెలిపారు. డిజిటల్ మాధ్యమంలో జీవన్ ప్రమాణ్ ఆండ్రాయిడ్ ద్వారా మొబైల్ ఫోన్లలో లేదా మీ సేవ కేంద్రంలో సమర్పించి నిరాటంకంగా వైద్య సేవలు పొందాలని సూచించారు. పూర్తి వివరాలకు తమ ఏరియాలోని ఏటీబీ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు.


