News April 9, 2024

నరసాపురం MLA అభ్యర్థిగా రామచంద్ర యాదవ్

image

భారత చైతన్య యువజన పార్టీ మొదటి జాబితాను ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆకుల వెంకటస్వామికి టికెట్ కేటాయించారు. ప్రముఖ న్యాయవాదిగా, మాజీ కౌన్సిలర్‌గా పని చేశారు. జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులుగా, నరసాపురం పార్లమెంటరీ కో-ఆర్డినేటర్‌గా పనిచేసి రాజీనామా చేశారు.

Similar News

News March 9, 2026

భీమవరం వన్‌టౌన్‌లో ‘పీజీఆర్‌ఎస్‌’: ఎస్పీ

image

భీమవరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరుగుతుందన్నారు. అర్జీదారులు ఈ మార్పును గమనించి, తమ విన్నపాలతో నేరుగా వన్‌టౌన్ స్టేషన్‌కు వచ్చి అధికారులను సంప్రదించాలని ఎస్పీ కోరారు.

News March 8, 2026

పగో:జిల్లాలో.. జోరుగా బెట్టింగ్..

image

ఉమ్మడి జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియా అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతోంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరును ఆసరాగా చేసుకుని బుకీలు పడగ విప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నెట్‌వర్క్ విస్తరించి, యాప్‌ల ద్వారా యువతకు వల వేస్తున్నారు. రూపాయికి పది వస్తాయని ఆశచూపుతూ బంతి బంతికీ పందాలు కాస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చనే వ్యామోహంతో మధ్యతరగతి యువత, విద్యార్థులు ఈ ఉచ్చులో పడి అప్పులపాలవుతున్నారు.

News March 8, 2026

భీమవరంలో 2కె రన్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భీమవరంలో ఆదివారం 2కె రన్ నిర్వహించారు. స్థానిక ప్రకాశం చౌక్ నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు సాగిన ఈ పరుగును కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శారీరక దృఢత్వమే ఆరోగ్యానికి పునాదని, మహిళలందరూ ప్రతిరోజూ వ్యాయామానికి సమయం కేటాయించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.