News October 27, 2025

FLASH: HYD: పెళ్లి కోసం చనిపోయాడు..!

image

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధిలో ఇంట్లో వారు <<18119524>>తనకు పెళ్లి చేయడం లేదంటూ<<>> ఈరోజు ఓ వ్యక్తి హైటెన్షన్ టవర్ పైనుంచి దూకిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పినట్లు సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ మాధవ్ తెలిపారు. అతడిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు కాల్ చేయాలని, మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

Similar News

News October 28, 2025

వరంగల్: లక్కీ డ్రాలో భార్యాభర్తలను వరించిన అదృష్టం..!

image

నూతన మద్యం పాలసీ 2025-27 కింద మద్యం షాపుల కేటాయింపునకు గాను వరంగల్‌లోని ఉర్సుగుట్ట వద్ద నాని గార్డెన్లో డ్రా నిర్వహించారు. ఈ లాటరీలో నర్సంపేటకు చెందిన గంప రాజేశ్వర్ గౌడ్, ఆయన భార్య గంప సాంబలక్ష్మి విజేతలుగా నిలిచారు. వీరికి నర్సంపేట పరిధిలోని షాప్ నెంబర్ 5, 38 కేటాయించారు. లక్కీ డ్రాలో గెలవడం పట్ల దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

News October 28, 2025

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రత్యామ్నాయాలు: మంత్రి

image

TG: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. నీటిపారుదలశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘సుందిళ్ల లింక్ ద్వారా సవరించిన సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశాం. ఇది ప్రాజెక్టు వ్యయాన్ని దాదాపు 10-12% తగ్గిస్తుంది. భూసేకరణను సగానికి తగ్గిస్తుంది. మునుపటి ప్రణాళికలతో పోలిస్తే సుమారు ₹1,500-1,600Cr ఆదా చేస్తుంది’ అని చెప్పారు.

News October 28, 2025

ప్రారంభమైన వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లు: కలెక్టర్

image

వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలను HNK జిల్లాలో ప్రారంభమైనట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. పంటల ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాలలో గన్నీ సంచులు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తేమ మీటర్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా 7330751364ను సంప్రదించాలని సూచించారు.