News April 9, 2024
భారీగా పడిపోయిన పేటీఎం UPI విలువ

పేమెంట్స్ బ్యాంక్ సంక్షోభం దెబ్బ పేటీఎం UPI మార్కెట్ షేర్పై భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. మార్చిలో ఈ విలువ (9%) నాలుగేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఫిబ్రవరిలో పేమెంట్స్ బ్యాంక్పై RBI ఆంక్షలు విధించినప్పుడు ఈ విలువ 11%కి తగ్గింది. UPI కన్నా వాలెట్పైనే సంస్థ ఎక్కువగా దృష్టి సారించడం ఈ క్షీణతకు మరో కారణం అంటున్నారు నిపుణులు. మరోవైపు గత రెండు నెలల్లో ఫోన్పే మార్కెట్ షేర్ 50% పెరగడం గమనార్హం.
Similar News
News January 3, 2026
నవగ్రహ ప్రదక్షిణలో పఠించాల్సిన మంత్రం

“ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:”
నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తే.. మనసు ఏకాగ్రతతో నిండి, గ్రహాల అనుగ్రహం వేగంగా లభిస్తుంది. సూర్యుడు మొదలుకొని కేతువు వరకు తొమ్మిది గ్రహాలను స్మరిస్తూ చేసే ఈ ప్రార్థన జాతక దోషాలను హరిస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. అలాగే గ్రహ గతులు అనుకూలించి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.
News January 3, 2026
జీడిమామిడిలో వచ్చిన కాయలు నిలబడాలంటే?

జీడిమామిడిలో పూత తర్వాత వచ్చిన కాయలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి. చాలా తోటల్లో ఇది కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గి కొత్తగా వచ్చిన కాయలు నిలబడాలంటే 19-19-19 లేదా మల్టికే(13-0-45)ను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి కాయలు తడిచేలా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కాయలు మొక్కలపై నిలబడి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
News January 3, 2026
ఫిబ్రవరిలో డీఎస్సీ.. 2,500 పోస్టులు?

AP: రాష్ట్రంలో మరోసారి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డీఎస్సీ నిర్వహణ ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో 2,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. డీఎస్సీలో కొత్తగా ఇంగ్లిష్, కంప్యూటర్కు సంబంధించి ఒక పేపర్గా ఎగ్జామ్ నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉంది.


