News October 28, 2025
లోకేశ్ ఆధ్వర్యంలో డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్

AP: డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2030 నాటికి 6వేల MW డేటా సామర్థ్యమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కౌన్సిల్ను మంత్రి నారా లోకేశ్ లీడ్ చేయనున్నారు. ఇందులో Microsoft Azure, Jio Platforms వంటి అంతర్జాతీయ కంపెనీలు, IIM విశాఖ, IIT తిరుపతి సంస్థల ప్రతినిధులకు స్థానం కల్పించారు. పెట్టుబడులు, అనుమతులు, నైపుణ్యాభివృద్ధి వంటి వాటిపై కౌన్సిల్ మార్గనిర్దేశం చేయనుంది.
Similar News
News October 28, 2025
ఏపీ న్యూస్ రౌండప్

● స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.410 కోట్ల నిధులు విడుదల
● నేడు టీటీడీ బోర్డు సమావేశం.. వైకుంఠ ద్వార దర్శనాలపై చర్చ
● మలేరియా నివారణ చర్యల్లో భాగంగా గిరిజన ప్రాంత ప్రజలకు 89,845 దోమ తెరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం
● స్త్రీనిధిలో నేటి నుంచి 31 వరకు జరగాల్సిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల ఇంటర్వ్యూలు తుఫాన్ కారణంగా DEC 1 నుంచి 4కు వాయిదా
News October 28, 2025
కల్పసూత్రాల్లో ఏం ఉంటాయంటే..?

కర్మలను ఆచరించే విధానాన్ని, ఆంతర్యాన్ని తెలిపేవే కల్పసూత్రాలు. ఇవి ఏ మంత్రం ఎక్కడ వాడాలి, క్రతువులకు కావలసిన సామగ్రి, పండితుల సంఖ్యను వివరిస్తాయి. ఇవి 3 రకాలు. యజ్ఞయాగాదుల శ్రుతి ఆధారిత క్రతువులను వివరించేవి శ్రౌతసూత్రాలు. గర్భాదానం, వివాహం, ఉపనయనం వంటి గృహస్థ ధర్మాలకు సంబంధించినవి గృహ్యసూత్రాలు. రాజధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, నీతి నియమాలను బోధిస్తూ ధర్మమార్గంలో నడిపించేవి ధర్మ శాస్త్రాలు.<<-se>>#VedikVibes<<>>
News October 28, 2025
పెయ్య దూడకు జున్నుపాలను నిర్లక్ష్యం చేయొద్దు

పశువు ఈనిన ఒక గంట లోపల దూడకు జున్ను పాలు తాగించాలి. ఈ సమయంలోనే జున్ను పాలలో రోగనిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్ను దూడ వినియోగించుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆలస్యమైతే ఈ యాంటీబాడీస్ను జీర్ణించుకొనే శక్తి పెయ్యలో తగ్గుతుంది. జున్ను పాలలో తేలికగా జీర్ణమయ్యే మాంసకృత్తులు, విటమిన్-ఎ ఎక్కువగా ఉంటాయి. జున్ను పాలు తాగిన దూడలు 6 నెలల వయసు వరకు రోగనిరోధక శక్తిని ఎక్కువగా కలిగి ఉండి త్వరగా పెరుగుతాయి.


