News October 28, 2025
ముచ్చటగా మూడు షాపులు దక్కించుకున్న మహిళ

మహబూబాబాద్ జిల్లాలోని ఓ మహిళను అదృష్టం వరించింది. లక్కీ డ్రాలో ముచ్చటగా మూడు వైన్ షాపులను దక్కించుకుంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్కు చెందిన ఎన్.శ్రీవాణికి డోర్నకల్ పట్టణంలో గౌడ కేటగిరీలో రెండు షాపులు రాగా.. ముల్కలపల్లిలో సైతం ఓ షాప్ వచ్చింది. దీంతో వారి ఆనందానికి హద్దులు లేవు. మీకు తెలిసిన వారికి లక్కీ డ్రాలో షాప్లు వస్తే కామెంట్లో తెలపండి.
Similar News
News October 28, 2025
గుంటూరు: 92 కేంద్రాలకు 6 వేల మంది తరలింపు

మొంథా తుపాను నేపథ్యంలో జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా 92 పునరావాస కేంద్రాలకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 6 వేల మంది నిర్వాసితులను తరలించారు. కేంద్రాల్లో వారికి తాగునీరు, ఆహారం, చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు అందిస్తున్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా నేతృత్వంలో యంత్రాంగం సేవలు అందిస్తోంది.
News October 28, 2025
బస్సుల్లో ప్రయాణికుల భద్రత ముఖ్యం: మంత్రి

బస్సులో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత కల్పించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. రాయచోటిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్లానర్స్ అండ్ ఇంజినీర్స్ సీఈవోతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో బస్సుల భద్రత, నాణ్యతను పరిశీలించాలని మంత్రి కోరారు. బస్సుల యజమానులు భద్రత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News October 28, 2025
బీట్రూట్తో చిన్నారులకు మేలు

పిల్లలు పెరిగే కొద్దీ వారికి అందించే పోషకాలు కూడా పెరగాలి. దానికి బీట్రూట్ మంచి ఆప్షన్ అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో ఫైబర్, ఫోలేట్, మాంగనీస్, పొటాషియంతో పాటు విటమిన్ బి9 ఉండటం వల్ల ఎర్రరక్త కణాల తయారీకి, రక్త ప్రసరణకు తోడ్పడతాయి. పిల్లల్లో మెదడు, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కాబట్టి పిల్లల ఆహారంలో దీన్ని చేర్చాలని చెబుతున్నారు.


