News October 28, 2025

‘మొంథా’ ఎఫెక్ట్: నంద్యాల జిల్లాలో పాఠశాలలకు సెలవులు

image

‘మొంథా’ తుఫాను కారణంగా నంద్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు నేడు, రేపు (28, 29వ తేదీలు) రెండు రోజుల పాటు సెలవులను ప్రకటిస్తూ కలెక్టర్ రాజకుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పలుచోట్ల పాఠశాలలు కొన్ని దెబ్బ తిని, పైకప్పులు పడిపోయే ప్రమాదం కూడా ఉన్నందున సెలవులను ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఈఓలకు డీఈఓ జనార్దన్ రెడ్డి సెలవుల సర్కులర్ జారీ చేశారు.

Similar News

News October 28, 2025

చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

NLG: చెకుముకి సైన్స్ సంబరాలు 2025 పోస్టర్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం తన ఛాంబర్లో ఆవిష్కరించారు. పాఠశాల స్థాయిలో 8, 9 10వ తరగతుల విద్యార్థులకు సైన్స్ టెంపర్‌ని అవగాహన కల్పించేలా ప్రతి ఏటా జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహణకు సహకరించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో దేవరకొండ ఏఎస్పీ మౌనిక, జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

News October 28, 2025

ఆగిన రష్యన్ ఆయిల్ దిగుమతులు.. నెక్స్ట్ ఏంటి?

image

రష్యాలోని టాప్ ఎనర్జీ కంపెనీలపై US ఆంక్షల నేపథ్యంలో భారత రిఫైనరీలు కొత్తగా ఆయిల్ దిగుమతులపై వెనుకడుగు వేస్తున్నాయి. పేమెంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉండటమే ఇందుకు కారణం. ఈ విషయంలో ప్రభుత్వం, సప్లయర్ల నుంచి క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫ్రెష్ ఆయిల్ టెండర్ జారీ చేసిందని, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పాట్ బయ్యింగ్‌కు సిద్ధమైందని తెలిసింది.

News October 28, 2025

భగవద్గీతను ఎవరెందుకు చదవాలి?

image

భగవద్గీత మానవులందరికీ మార్గదర్శనం చేసే దివ్య గ్రంథం. విద్యార్థులు క్రమశిక్షణ కోసం, యువకులు సరైన జీవన విధానం కోసం, వృద్ధులు మరణానంతర ఆలోచనల కోసం, అజ్ఞానులు జ్ఞానం కోసం, ధనవంతులు దయ అలవరుచుకోవడానికి, బలవంతులు దిశానిర్దేశం కోసం, కష్టాల్లో ఉన్నవారు పరిష్కారం కోసం, వినయవంతులు ఔన్నత్యం కోసం భగవద్గీతను చదవాలి. మోక్షం కోరేవారు, అశాంతిగా ఉన్నవారు.. ఇలా ప్రతి ఒక్కరూ ఉత్తమ జీవితం కోసం గీతను అధ్యయనం చేయాలి.