News October 28, 2025

కుప్పంకు భారీ పరిశ్రమలు… 22 వేలు మందికి ఉద్యోగాలు…!

image

సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం పారిశ్రామిక వాడగా మారనుంది. నేడు వర్చువల్ గా నిర్వహించాల్సిన శంకుస్థాపన కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. AELAP, ACE, E-ROYCE, ఆదిత్య బిర్లా గ్రూప్స్, ఎస్వీఎఫ్ సోయా కంపెనీలతో పాటుగా మదర్ డెయిరీ, శ్రీజ డెయిరీ 2027 నాటికి పూర్తి అవుతాయి. కంపెనీలు అందుబాటులోకి రాగానే ప్రత్యక్షంగా 22 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని సమాచారం.

Similar News

News October 28, 2025

నిండ్ర: బస్సును ఢీకొన్న లారీ

image

పుత్తూరు – చెన్నై జాతీయ రహదారిలో నిండ్ర మండలం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. నిండ్ర మండలంలోని కొప్పేడు వద్ద సత్యవేడు ఆర్టీసీ డిపో బస్సును లారీ ఢీకొంది. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయినట్లు సమాచారం. అలాగే ఇవాళ ఉదయం పుంగనూరు-చెన్నై హైవేపై రెండు బస్సులు ఢీకొన్న విషయం తెలిసిందే.

News October 28, 2025

ఐరాల: ప్రమాదకరంగా రాకపోకలు

image

ఐరాల మండలంలోని ఉప్పరపల్లె గ్రామస్థులు నీవా నదిపై ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. పాతపేట వద్ద ఇటీవల తాత్కాలికంగా నదిపై దారి ఏర్పాటు చేసుకున్నారు. వర్షాల నేపథ్యంలో దారి కొట్టుకుపోయింది. దీనిపై ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసుకుని రాకపోకలు కొనసాగిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.

News October 28, 2025

చిత్తూరు: విద్యుత్ ఉద్యోగులకు సెలవులు లేవు

image

మొంథా తుఫాన్ కారణంగా చిత్తూరు డివిజన్ లో విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈఈ మునిచంద్ర సిబ్బందిని అదేశించారు. మరో రెండు రోజుల పాటు సెలవులు ఎవరికీ ఇవ్వడం జరగదని, సెలవుల్లో ఉన్నవారు కూడా విధులకు హాజరవ్వాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.