News October 28, 2025

విజయవాడ: ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం

image

మైనార్టీ యువతీ యువకులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఐటీఐ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత సాధించిన 21-30 ఏళ్ల మధ్య వయస్సు గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 2వ తేదీ వరకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం ఆధ్వర్యంలో జర్మన్ భాషలో శిక్షణ అందిస్తారు.

Similar News

News October 28, 2025

యూసుఫ్‌గూడలో CM మాట.. కార్మికుల్లో కొత్త ఆశలు

image

కృష్ణానగర్‌.. సినీ కార్మికుల అడ్డా. యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు నుంచి వెంకటగిరి వరకు ఉ.6 గంటలకే హడావిడి ఉంటుంది. ఈరోజు మాత్రం కొత్తగా ఉంది. సినీ కార్మికుల కోసం CM రావడంతో సందడి కనిపించింది. రేవంత్‌ని చూడాలన్న ఉత్సాహంతో వేలాదిమంది పోలీస్ గ్రౌండ్‌కు క్యూ కట్టారు. CM నోటి నుంచి శుభవార్త కూడా విన్నారు. టికెట్ల పెంపులో 20 శాతం కార్మికులకు ఇవ్వాలని నిర్మాతలకు చెప్పడంతో కార్మికుల ఉత్సాహం రెట్టింపయ్యింది.

News October 28, 2025

రేపు ఏలూరు జిల్లాలో పాఠశాలలకు సెలవు

image

జిల్లాలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్న కలెక్టర్ వెట్రిసెల్వి ప్రకటించారు. తుఫాను తీరం దాటడంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు పాఠశాలలు తరగతులు నిర్వహించరాదన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 28, 2025

ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

image

బాపట్ల జిల్లాలో తుపాన్ ప్రభావం నేపథ్యంలో విద్యుత్, ఇరిగేషన్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. తుపాన్‌ వల్ల నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం నారా చంద్రబాబు సూచనల మేరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులను ఆదేశించారు. వాగుల వద్ద ప్రజలు రోడ్లు దాటకుండా, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.