News October 28, 2025

HYD: రోగికి సేవల పేరిట మహిళను ఏపీకి తరలింపు!

image

రోగికి సేవచేయడానికెళ్లిన మహిళ తిరిగిరాని ఘటన నాగోల్ PS పరిధిలో జరిగింది. హనుమాన్‌నగర్ గార్డెన్-IIలో బంకా హేమేశ్వరి(45) ఉంటుంది. OCT 25న ఉద్యోగానికెళ్తున్నట్లు కూతరు జయశ్రీ(22)కి తెలిపింది. సా.7:30కి తల్లి ఫోన్ కలవలేదు. 26న ఉ.9కి ఫోన్ చేస్తే రోగి కుటుంబం విజయవాడకు తీసుకెళ్లిందని చెప్పింది. రా.11కు మరోకూతురు తేజస్వికి వీడియో కాల్‌లో రోగిని చూపిస్తూ ఏడుస్తూ కాల్ కట్ చేసిందని PSలో ఫిర్యాదు చేసింది.

Similar News

News October 28, 2025

యూసుఫ్‌గూడలో CM మాట.. కార్మికుల్లో కొత్త ఆశలు

image

కృష్ణానగర్‌.. సినీ కార్మికుల అడ్డా. యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు నుంచి వెంకటగిరి వరకు ఉ.6 గంటలకే హడావిడి ఉంటుంది. ఈరోజు మాత్రం కొత్తగా ఉంది. సినీ కార్మికుల కోసం CM రావడంతో సందడి కనిపించింది. రేవంత్‌ని చూడాలన్న ఉత్సాహంతో వేలాదిమంది పోలీస్ గ్రౌండ్‌కు క్యూ కట్టారు. CM నోటి నుంచి శుభవార్త కూడా విన్నారు. టికెట్ల పెంపులో 20 శాతం కార్మికులకు ఇవ్వాలని నిర్మాతలకు చెప్పడంతో కార్మికుల ఉత్సాహం రెట్టింపయ్యింది.

News October 28, 2025

HYD: ఆన్‌లైన్‌లో ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు!

image

GHMC పౌరులకు సేవలను సులభతరం చేసింది. ఇకపై ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు ghmc.gov.in ద్వారా ఇంటి నుంచే లభిస్తాయి. ​పౌరులు మీసేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం తమ PTIN/TIN/VLTN నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేస్తే చాలు. దరఖాస్తులకు త్వరితగతిన ఆన్‌లైన్ ద్వారానే అనుమతులు లభిస్తాయి.
SHARE IT

News October 28, 2025

జూబ్లీ బైపోల్: మంత్రులకు డివిజన్ల బాధ్యతలు

image

జూబ్లీహిల్స్ బైపోల్‌లో భాగంగా డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. రహమత్‌నగర్- కోమటిరెడ్డి, పొంగులేటి, బోరబండ- సీతక్క, మల్లు రవి, వెంగళ్‌రావునగర్- తుమ్మల, వాకిటి శ్రీహరి, సోమాజిగూడ- శ్రీధర్ బాబు, అడ్లూరి, షేక్‌పేట్- కొండా సురేఖ, వివేక్, ఎర్రగడ్డ- దామోదర, జూపల్లి, యూసుఫ్‌గూడ- ఉత్తమ్, పొన్నం ప్రభాకర్‌కు ప్రచార బాధ్యతలు అప్పగించారు.