News October 28, 2025

HYD: జూబ్లీ బరిలో 29 మంది స్వతంత్రులు

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీల నుంచి 26 మంది అభ్యర్థులు బరిలో దిగగా.. 29 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే అభ్యర్థులకు గుర్తులు కేటాయించగా.. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 ఓటర్లు ఉన్నారు.

Similar News

News October 28, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: ప్రతి 100 ఓట్లకు ఒకరికి బాధ్యత

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఒక్క ఓటు కూడా మిస్ కావొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. 100% పోలింగ్ జరిగేలా చూసి తమ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించేలా చూడాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా ప్రతీ వంద మంది ఓటర్లకు ఒకరిని ఇన్‌ఛార్జిగా నియమించనుంది. ఆ ఇన్‌ఛార్జి ఆ ఓటర్లను కలిసి తప్పనిసరిగా ఓటువేసేలా జాగ్రత్తలు తీసుకోనుంది. ఇందుకు సంబంధించి మంత్రి పొన్నం ఆధ్వర్యంలో నాయకులు చర్చలు నిర్వహించారు.

News October 28, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: మహిళలు.. కేవలం 7 శాతమేనా!

image

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను రాజ్యాంగం కల్పించింది. అయితే వివిధ రాజకీయ పార్టీలు మహిళలకు పోటీచేసే అవకాశం ఇవ్వడం లేదు. ఇపుడు జూబ్లీహిల్స్ బైపోల్‌లోనూ అదే పరిస్థితి. కేవలం 7% మంది మాత్రమే పోటీచేస్తున్నారు. మొత్తం 58 మంది ఈ ఎన్నికల్లో బరిలో ఉండగా కేవలం నలుగురే పోటీలో ఉన్నారు. దీంతో.. ఇదేనా మహిళలకు దక్కే సమానత్వం అని పలువురు వాపోతున్నారు.

News October 28, 2025

ఇక ‘సింగూరు’ చిక్కులు లేకుండా ప్రభుత్వం చర్యలు

image

మహానగరానికి తాగునీటిని సరఫరా చేసే సింగూరు రిజర్వాయరుకు మరమ్మతులు చేయాలని సర్కారు నిర్ణయించింది. దీనికోసం సర్కారు రూ.16 కోట్లను విడుదల చేసింది. ఈ డిసెంబర్ నుంచి పనులు మొదలు కానున్నాయి. ఈలోపు రిజర్వాయర్‌లో ఉన్న నీటిని ఖాళీ చేయనున్నారు. దాదాపు రెండు ఏళ్ల పాటు సింగూరుకు పనులు జరగుతాయి. ప్రస్తుతం సింగూరు నుంచి సిటీకి 7 TMCల నీరు ఉపయోగిస్తున్నారు.