News October 28, 2025
అనకాపల్లి: పెట్టుబడి పేరుతో రూ.13.62 లక్షలు కొట్టేసింది

ఓ సంస్థలో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో రెట్టింపు ఆదాయం వస్తుందని అనకాపల్లికి చెందిన ఎలక్ట్రీషియన్ రమణబాబును మోసం చేసి రూ.13.62 లక్షలు కాజేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగస్టు 17న రమణబాబుకు ఓ మహిళ ఫోన్ చేసి తాను సూచించిన సంస్థలో పెట్టుబడులు పెట్టాలని నమ్మించినట్లు సీఐ ప్రేమ్ కుమార్ సోమవారం తెలిపారు.రమణబాబు ఆమె ఖాతాకు డిజిటల్ ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత మోసపోయినట్లు గ్రహించాడు.
Similar News
News October 29, 2025
అదును తప్పిన పైరు.. ముదిమిలో బిడ్డలు ఒక్కటే

ఏ పంటకైనా అదును(అనుకూల సమయం) ముఖ్యం. సరైన సమయానికి విత్తనం వేయకపోతే పంట సరిగా రాదు, దాని వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ముసలి వయసులో పిల్లలు పుడితే, వారు తల్లిదండ్రులకు అండగా నిలబడలేరు లేదా వారికి సేవ చేయలేరు. ఈ రెండూ సమయానికి చేయని పనులు లేదా నిష్ప్రయోజనమైన పరిస్థితులను తెలియజేస్తాయి.
☛ మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి.
News October 29, 2025
ఇంటర్ అర్హతతో RRBలో 3,058 పోస్టులు

RRB 3,058 అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు NOV 27 వరకు అప్లై చేసుకోవచ్చు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి. 18- 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
News October 29, 2025
మానవ జన్మకు అర్థమిదే..

ఈ ప్రపంచంలో మనం వేరే రూపంలో కనిపించడానికి కారణం మాయ ప్రభావం. అందుకే దీనిని జన్మ అంటారు. పుట్టిన ప్రతి వ్యక్తికి చివరికి నశించిపోయే స్వభావం ఉంటుంది. అందుకే అతన్ని జీవుడని పిలుస్తాము. జీవుడంటే పుట్టినప్పటి నుంచే అనేక కష్టాలు, ఆశలు అనే బంధాలలో చిక్కుకున్నవాడు అని కూడా అర్థం. మనం ఈ బంధాల నుంచి పూర్తిగా బయటపడాలంటే మాతాపితృ రూపమైన శివలింగాన్ని (జన్మలింగాన్ని) పూజించాలి. అర్చించాలి. <<-se>>#SIVOHAM<<>>


