News October 28, 2025

VZM: రేపటి జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో బి. సత్యనారాయణ మంగళవారం తెలిపారు. తదుపరి సమావేశ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. సభ్యులు, అధికారులు దీనిని గమనించాలని సూచించారు.

Similar News

News October 29, 2025

గంజాయి లేడి డాన్ అంగూర్ భాయ్‌కి హైకోర్టులో చుక్కెదురు

image

హైదరాబాద్ గంజాయి లేడీ డాన్‌గా పేరుగాంచిన అంగూర్ భాయ్‌కి హైకోర్టులో చుక్కెదురైంది. పీడీ యాక్ట్‌పై ఆమె వేసిన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ధూల్‌పేట్‌ నుంచి గంజాయి వ్యాపారం నిర్వహిస్తూ అనేక కేసుల్లో నిందితురాలైన అంగూర్ భాయ్‌పై ప్రభుత్వం అమలు చేసిన పీడీ యాక్ట్‌ను సమర్థిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

News October 29, 2025

బెల్లంపల్లి: ‘భౌతిక దాడులకు బదులు సాంకేతిక దాడులు’

image

గతంలో ఆర్థిక నేరాలు భౌతిక దాడులతో జరిగేవని, నేడు సాంకేతికత టెక్నాలజీతో జరుగుతున్నాయని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్ రెడ్డి అన్నారు. జీఎం కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్యోగులు వారి వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ పాస్‌వర్డ్‌లు, కుటుంబ సభ్యుల ఫొటోలు అంతర్జాలంలో పొందుపరచవద్దని సూచించారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు క్విజ్ నిర్వహించి బహుమతులు అందజేశారు.

News October 29, 2025

అంగరంగ వైభవంగా ఉద్దాల మహోత్సవం

image

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టమైన ఉద్దాలమహోత్సవం మంగళవారంరాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు లక్షల మంది భక్తులు హాజరై స్వామివారి పాదుకలను దర్శించుకున్నారు. స్వామివారి పాదుకలను తాకి పునితులయ్యేందుకు భక్తులు పోటీపడ్డారు. దీంతో చిన్నవడ్డేమాన్‌, ఊకచెట్టువాగు, అప్పంపల్లి, తిర్మలాపూర్‌ గ్రామాలతోపాటు స్వామి ఆలయం వరకు జనసంద్రంమైంది. ఉత్సవంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.