News October 28, 2025

VJA: ‘వరి, పత్తి పొలాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడండి’

image

వరి, పత్తి పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయ కుమారి రైతులకు సూచించారు. పొలాల్లోని నీరు బయటకు వెళ్లేలా పంట బోదేలు, డ్రైనేజీలను సిద్ధం చేసుకోవాలన్నారు. తుపాను వెళ్లే వరకు వరి కోత పనులను వాయిదా వేసుకోవాలని సూచించారు. వర్షానికి అధైర్య పడకుండా అప్రమత్తంగా ఉండాలని రైతులను ఆమె కోరారు.

Similar News

News October 29, 2025

BIG ALERT: ఇవాళ అతిభారీ వర్షాలు

image

AP: మొంథా తీవ్ర తుఫానుతో రాష్ట్రంలో ఇవాళ అతిభారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, NTR, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

News October 29, 2025

అదును తప్పిన పైరు.. ముదిమిలో బిడ్డలు ఒక్కటే

image

ఏ పంటకైనా అదును(అనుకూల సమయం) ముఖ్యం. సరైన సమయానికి విత్తనం వేయకపోతే పంట సరిగా రాదు, దాని వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ముసలి వయసులో పిల్లలు పుడితే, వారు తల్లిదండ్రులకు అండగా నిలబడలేరు లేదా వారికి సేవ చేయలేరు. ఈ రెండూ సమయానికి చేయని పనులు లేదా నిష్ప్రయోజనమైన పరిస్థితులను తెలియజేస్తాయి.
☛ మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి.

News October 29, 2025

ఇంటర్ అర్హతతో RRBలో 3,058 పోస్టులు

image

RRB 3,058 అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు NOV 27 వరకు అప్లై చేసుకోవచ్చు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి. 18- 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.