News October 28, 2025

మిర్యాలగూడ: లక్కీ డ్రాలో మృతుడికి అవకాశం

image

మద్యం టెండర్ల లక్కీడ్రాలో ఓ మృతుడికి అవకాశం దక్కింది. ఈ ఘటన నల్గొండలో చోటుచేసుకుంది. MLGలోని మద్యం షాపు(63)నకు గోపులాపురం గ్రామానికి చెందిన కాసాని అశోక్(38) ఈనెల18న టెండరు దరఖాస్తు సమర్పించి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అతను చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. నిబంధనల ప్రకారం మృతుడి కుటుంబ సభ్యుల్లో ఒకరికి దుకాణం కేటాయించనున్నట్లు తెలిసింది.

Similar News

News October 29, 2025

తిరుపతి: ఇవాళ స్కూళ్లకు సెలవు లేదు

image

తిరుపతి కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఇవాళ నుంచి యథావిధిగా పనిచేయాలని DEO కేవీఎన్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడారు. DYEOలు, MEOలు, HMలు కలెక్టర్ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసి, అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈ సమాచారం తెలియజేయాలని పేర్కొన్నారు. పాఠశాలలు ఇవాళ నుంచే సాధారణంగా పనిచేసేటట్లు చూడాలని అన్నారు.

News October 29, 2025

త్వరలో మదనపల్లి జిల్లా సాకారం?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా మూడు జిల్లాలుగా మారింది. నాడు మదనపల్లిని అన్నమయ్య జిల్లాలో కలపడం కంటే జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ బలంగా వినిపించింది. దీనికి అనుకూలంగా మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై సీఎం చర్చించారు. త్వరలో దీనిపై ఆమోదం తెలిపి మదనపల్లి జిల్లా కేంద్రం అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు పుంగనూరు లేదా పీలేరు రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. జిల్లా కేంద్రం మదనపల్లిపై మీ కామెంట్.

News October 29, 2025

ఇతిహాసాలు క్విజ్ – 50

image

1. తులసి దేవికి పూర్వ జన్మలో ఉన్న పేరు ఏంటి?
2. త్రిపురాంతకుడు అంటే ఏ దేవుడు?
3. కర్ణుడి కవచకుండలాలను దానం చేయమని కోరింది ఎవరు?
4. వాక్కుకు అధిష్టాన దేవత ఎవరు?
5. ఎవరి ఆజ్ఞ మేరకు పరశురాముడు తన తల్లి తల నరికాడు?
☛ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>