News October 28, 2025

నర్సీపట్నం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు రద్దు

image

నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి దూరప్రాంతాలకు వెళ్లే బస్సులను రద్దు చేసినట్టు ప్రజా రవాణా సంస్థ డిపో మేనేజర్ ధీరజ్ తెలిపారు. విజయవాడ, హైదరాబాద్, కాకినాడ తదితర రూట్ల బస్సులను 3రోజుల పాటు నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి బస్సులను చింతపల్లి వరకే నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత బస్సులను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.

Similar News

News October 29, 2025

దేశవాళీ వరి.. ఒకసారి నాటితే 3 పంటలు పక్కా

image

ఒకసారి నాటితే 3 సార్లు కోతకు వచ్చే ‘తులసి బాసో’ దేశవాళీ వరి రకాన్ని సాగు చేస్తున్నారు చిత్తూరు(D) పలమనేరుకు చెందిన చందూల్ కుమార్‌రెడ్డి. ఇది సువాసన కలిగిన చాలా చిన్న గింజ వరి. మంచి పోషక, ఔషధ గుణాలు కలిగి తినడానికి మధురంగా ఉంటుంది. తొలి పంట 135 రోజులకు, 2వ పంట 60 నుంచి 70 రోజులకు, 3వ పంట 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. ✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News October 29, 2025

సర్వదర్శనానికి 8 గంటల పైనే

image

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం 8 కంపార్ట్మెంట్ లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. మంగళవారం 64,065 మంది భక్తులు స్వామి వారి దర్శనం చేసుకోగా.. 25,250 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.57 కోట్లు ఆదాయం వచ్చింది.

News October 29, 2025

కర్నూలు: ‘ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు’

image

ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ చేసినా ఉపేక్షించమని మంగళవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కేఎంసీలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత కలవారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ, సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, సాయి సుధీర్, రేణుక దేవి, సీఐ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.