News April 10, 2024

పల్నాడు: నేటి జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే

image

పల్నాడు జిల్లాలో సీఎం జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్ర నేటి ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం నుంచి ప్రారంభమవుతుంది. రొంపిచర్ల, విప్పర్ల, నకరికల్లు, దేవరంపాడు క్రాస్ రోడ్డు కొండమోడు మీదగా పిడుగురాళ్లకు చేరుకుంటుంది. పిడుగురాళ్ల అయ్యప్ప నగర్ వద్ద సీఎం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం కొండమోడు జంక్షన్ మీదుగా రాజుపాలెం, అనుపాలెం, రెడ్డిగూడెం మీదగా దూళిపాళ్ళ చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారు.

Similar News

News January 12, 2026

GNT: గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక!

image

గుంటూరు జిల్లాలో 1991 జనవరి 12న జన్మించిన ద్రోణవల్లి హారిక అంతర్జాతీయ చదరంగ క్రీడాకారిణి. చిన్నవయసులోనే అండర్-9, 10, 14, 18 విభాగాల్లో ప్రపంచ స్థాయి పతకాలు సాధించింది. మహిళా గ్రాండ్ మాస్టర్, ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ హోదాలను దక్కించుకుంది. ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌షిప్‌లో మూడుసార్లు (2012, 2015, 2017) కాంస్య పతకాలు గెలిచింది. ఆమె ప్రతిభకుగాను కేంద్రం అర్జున, పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది.

News January 11, 2026

GNT: ‘చిరు’ సినిమా హిట్ అవ్వాలని అంబటి ట్వీట్!

image

మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అభిమాన సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిపై మరోసారి తన అభిమానాన్ని X వేదికగా చాటుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి నటించిన “మన శంకర వరప్రసాద్” చిత్రం విడుదల సందర్భంగా X వేదికగా ఆదివారం అంబటి రాంబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా సూపర్, డూపర్ హిట్ అవ్వాలని అంబటి ఆకాంక్షించారు.

News January 11, 2026

రేపు తెనాలి ఐటీఐలో అప్రెంటిస్ మేళా..15 కంపెనీల రాక

image

తెనాలి చినరావురులోని ప్రభుత్వ ఐటీఐ శిక్షణ కేంద్రంలో ఈ నెల 12వ తేదీ సోమవారం నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రావి చిన వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగ మేళాలో సుమారు 15 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని ఐటిఐ పాసైన విద్యార్థులందరికీ అప్రెంటిస్ షిప్ అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. అర్హత కలిగిన వారు తమ సర్టిఫికెట్లు, బయోడేటా, ఆధార్ కార్డు నకలుతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని చెప్పారు.