News October 28, 2025

ఉండవెల్లి మండలంలో 38.9 మిల్లీమీటర్ల వర్షం

image

గద్వాల జిల్లాలో ముసురు పడింది. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉండవెల్లి మండలంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు 38.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ధరూర్‌లో 0.2, గద్వాల 1.3, మల్దకల్ 0.4, గట్టు 1.0, అయిజ 0.3, రాజోలి 2.8, వడ్డేపల్లి 1.3, మానవపాడు 13.8, అలంపూర్ 12.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా కేటీదొడ్డి, ఇటిక్యాల మండలాల్లో వర్షం కురవలేదు.

Similar News

News October 29, 2025

NLG: శిశువు విక్రయం కేసులో పురోగతి

image

నవ జాత శిశువు విక్రయం కేసులో నల్గొండ పోలీసులు పురోగతి సాధించారు. కడుపున పుట్టిన ఆడపిల్లను కన్నవారే విక్రయించిన ఘటనలో చిన్నారిని ఏలూరుకు చెందిన దంపతుల వద్ద పోలీసులు గుర్తించారు. శిశువు సహా ఆ దంపతులను నల్గొండకు తీసుకువచ్చి విచారిస్తున్నట్లు తెలిసింది. తిరుమలగిరి (సాగర్) మండలం ఎల్లాపురం తండాకు చెందిన కొర్ర బాబు, పార దంపతుల సంతానమైన ఆడ శిశువును రూ.3 లక్షలకు విక్రయించిన విషయం తెలిసిందే.

News October 29, 2025

త్వరలో మదనపల్లి జిల్లా సాకారం..?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా మూడు జిల్లాలుగా మారింది. నాడు అన్నమయ్య జిల్లాకు కలవడం కంటే మదనపల్లి జిల్లా కావాలని డిమాండ్ బలంగా వినిపించింది. దీనికి అనుకూలంగా మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై సీఎం చర్చించారు. త్వరలో దీనిపై ఆమోదం తెలిపి మదనపల్లి జిల్లా కేంద్రం అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు పుంగనూరు లేదా పీలేరు రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. జిల్లా కేంద్రం మదనపల్లిపై మీ కామెంట్ చెప్పండి..!

News October 29, 2025

ఈ జిల్లాల్లో యథావిధిగా స్కూళ్లు

image

AP: మొంథా తుఫాను బలహీనపడింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిన్నటి వరకు సెలవులు కొనసాగిన అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ స్కూళ్లు యథావిధిగా నడవనున్నాయి. ఈమేరకు అధికారులు వెల్లడించారు. అటు తిరుపతి జిల్లాకు తొలుత ఇవాళ కూడా హాలిడే ప్రకటించినా.. తుఫాను ప్రభావం లేకపోవడంతో సెలవు రద్దు చేశారు. స్కూళ్లు కొనసాగుతాయని, విద్యార్థులు రావాలని సూచించారు.