News October 28, 2025

MHBD: రాయుతీపై వ్యవసాయ పనిముట్లు: DAO

image

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ శాఖలో సబ్ మిషన్ అన్ ఆగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం ద్వారా సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నాయని MHBD DAO విజయ నిర్మల అన్నారు. ఇందులో బ్యాటరీ స్ప్రేయర్లు 2496, పవర్ స్ప్రేయర్లు452, రోటవేటర్లు 178, సీడ్ కం ఫర్టి డ్రిల్స్ 36, డిస్క్ హరో/కల్టివేటర్స్/కేజ్ వీల్స్/MB ప్లవ్స్ 222, బండ్ ఫార్మర్స్ 9, పవర్ వీడర్స్ 17, బ్రష్ కట్టర్స్ 33 పవర్ టిల్లర్స్ ఉన్నాయి.

Similar News

News October 29, 2025

KNRలో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సెలవు ప్రకటిస్తూ విద్యాధికారులకు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అందుబాటులో ఉండాలని సూచించారు.

News October 29, 2025

ఏసీబీకి చిక్కిన యాదాద్రి దేవాలయ అధికారి

image

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పనిచేస్తున్న అధికారి ఉప్పల్‌లో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టు పడ్డాడు. ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.1,90,000 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఆలయంలో ఎలక్ట్రిసిటీ విభాగంలో పనిచేస్తున్న రామారావుకు సంబంధించిన బంధువుల ఇండ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.

News October 29, 2025

రేపు యథావిధిగా పాఠశాలలు: నంద్యాల డీఈవో

image

నంద్యాల కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలలు రేపటి నుంచి యథావిధిగా పనిచేయాలని డీఈవో జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు ఉంటే గురువారం సెలవు ఇవ్వాలని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.