News October 28, 2025

చైతన్యం వస్తుందా? గంజాయిపై యుద్ధమే శరణ్యం

image

భద్రాద్రి: గంజాయి అనర్థాలపై పోలీసులు పదేపదే అవగాహన కల్పిస్తున్నా, జిల్లాలో అక్రమ రవాణా కొనసాగుతుండటం ఆందోళనకరం. ఎస్పీ పిలుపుతో ‘చైతన్యం-డ్రగ్స్‌పై యుద్ధం’ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ ప్రయత్నం అభినందనీయమే కానీ, ప్రచారం కన్నా, నిరంతర పర్యవేక్షణ, కఠిన శిక్షలు, విద్యార్థుల్లో లోతైన మానసిక పరివర్తన తీసుకురాగలిగితేనే యువతలో శాశ్వత చైతన్యం వచ్చి, జిల్లా ‘డ్రగ్స్‌ రహితం’గా మారుతుంది.

Similar News

News October 29, 2025

రాబోయే 4 రోజులు కీలకం: మంత్రి సత్యకుమార్

image

మొంథా తుఫాన్ దృష్ట్యా రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్‌లో సమీక్షిస్తూ, అధికారులకు తగిన ఆదేశాలిచ్చారన్నారు. రాష్ట్రంలోని 2,555 మంది గర్భిణులను ఆసుపత్రులకు తరలించి వైద్యం అందించడం ద్వారా పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడారని ఆయన తెలిపారు.

News October 29, 2025

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్

image

తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో భారీ వర్షాల దృష్ట్యా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితులను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు. ఇంజినీరింగ్, శానిటేషన్ శాఖల అధికారులు, సిబ్బందికి కమిషనర్ పలు సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

News October 29, 2025

సీజేఐపై దాడిని ఖండిస్తూ నవంబర్ 1న నిరసన: మందకృష్ణ

image

సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ నవంబర్ 1వ తేదీన హైదరాబాదులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ దాడిని భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణించాలని ఎమ్మార్పీఎస్ పిలుపునిస్తోందని, నిరసనను జయప్రదం చేయాలని కోరారు.