News October 28, 2025
వరంగల్: బాలికపై బాలుడు అత్యాచారం

బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని ఓ తండాలో జరిగింది. ఉపాధి నిమిత్తం బాలిక తల్లి HYDకి వెళ్లడంతో అమ్మమ్మ వద్ద బాలిక ఉంటోంది. రోజూ మాదిరిగానే బాలిక అంగ్వాడీకి వెళ్లిన క్రమంలో అంగన్వాడీ టీచర్ కొడుకు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. బాలిక దుస్తులపై రక్తం మరకలు, గాయాలు చూసి పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News October 29, 2025
MHBD: ‘అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలి’

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను (7995074803) ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అత్యవసరమైన పరిస్థితి ఏర్పడినా ఈ నంబర్ను సంప్రదించాలని సూచించారు. కంట్రోల్ రూమ్ నందు సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
News October 29, 2025
తుఫాన్.. ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు

AP: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలు, మత్స్యకారులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయనుంది. ప్రతి కుటుంబానికి 25కేజీల బియ్యం(మత్స్యకారులకు 50కేజీలు), లీటర్ నూనె, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చక్కెర అందించనుంది. బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర సరఫరా వెంటనే ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేయాలని మార్కెటింగ్ కమిషనర్కు సూచించింది.
News October 29, 2025
రైతులు నష్టపోకూడదు.. జనగామ కలెక్టర్ ఆదేశం

జనగామ జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తుఫాను ప్రభావంతో రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ శాఖల అధికారులతో బుధవారం ఉదయం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.


