News October 28, 2025
కల్లుపై నిషేధం ఎత్తేస్తాం: తేజస్వీ యాదవ్

బిహార్ను దేశంలోనే నం.1గా తీర్చిదిద్దుతామని RJD నేత తేజస్వీ యాదవ్ అన్నారు. తమ మ్యానిఫెస్టో దీనికి రోడ్ మ్యాప్ అని చెప్పారు. ‘మేం గెలిస్తే కల్లుపై నిషేధం ఎత్తేస్తాం. అవినీతి అధికారులు, బీజేపీ నేతలు CM నితీశ్ను పప్పెట్గా చేశారు. NDA ఆయనను మళ్లీ సీఎం చేయదు’ అని పేర్కొన్నారు. కాగా తాము ఎక్కువ సీట్లు గెలుస్తామని అభిషేక్ బెనర్జీ (TMC) అన్నారు. OPS అమలు చేస్తామని దీపాంకర్ భట్టాచార్య(CPI) తెలిపారు.
Similar News
News October 29, 2025
బ్రెయిన్ స్ట్రోక్.. సత్వర వైద్యమే కీలకం

హైబీపీ, డయాబెటిస్, ఊబకాయం, ఒత్తిడి వల్ల మహిళల్లోనూ బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని న్యూరాలజిస్ట్ మురళీధర్రెడ్డి తెలిపారు. ‘మొత్తం బాధితుల్లో 30-45 ఏళ్ల వయసున్న వారు 15% వరకు ఉంటున్నారు. సకాలంలో చికిత్స చేయిస్తేనే ప్రాణాపాయాన్ని తప్పించవచ్చు. ఒక్కసారిగా మైకం, చూపుపోవడం, ముఖం ఒకవైపు జారిపోవడం, అవయవాల బలహీనం, మాట అస్పష్టత దీని లక్షణాలు’ అని పేర్కొన్నారు.
News October 29, 2025
బ్రెయిన్ స్ట్రోక్ నిర్ధారణ, చికిత్స ఇలా

మస్తిష్క రక్తనాళాల్లో ఏర్పడే వైఫల్యంతో బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుందని న్యూరాలజిస్ట్ మురళీధర్రెడ్డి తెలిపారు. CT స్కాన్, MRI, రక్త పరీక్షలు, ఎలక్ట్రో కార్డియోగ్రామ్, కరోటిడ్ అల్ట్రాసౌండ్, సెరెబ్రల్ యాంజియోగ్రామ్ వంటి టెస్టుల ద్వారా స్ట్రోక్ను నిర్ధారిస్తారన్నారు. ఫిజియోథెరపీతో పాటు, యాంటీ ప్లేట్లెట్లు, యాంటీ కాగ్యులెంట్లు, స్టాటిన్లు తీసుకోవడం ద్వారా ప్రాణాపాయాన్ని తప్పించవచ్చని పేర్కొన్నారు.
News October 29, 2025
ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

TG: ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని HYD IMD వెల్లడించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, MHBD, WGL, HNK, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, జనగామ, నాగర్ కర్నూల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని తెలిపింది.


