News October 28, 2025
జిల్లాలో 6,664 మందికి ఆశ్రయం: కలెక్టర్

తుపానును ఎదుర్కోవడానికి సమగ్ర ప్రణాళికతో ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం తెలిపారు. జిల్లాలో 30 ప్రధాన కాలువలు, 42 మధ్యస్థ కాలువలు ఉండగా, 103 గ్రామాలను తాకుతూ ఆ కాలులు వెళ్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 440 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 6,664 మందికి ఆశ్రయం కల్పించామన్నారు.
Similar News
News October 29, 2025
అజహరుద్దీన్కు మంత్రి పదవి

ఎల్లుండి తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నిన్న అజహరుద్దీన్, ఆయన కుమారుడు అసదుద్దీన్తో భేటీలో సీఎం రేవంత్ మంత్రి పదవిని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో మైనారిటీలు లేకపోవడంతో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. MLCగా అజహరుద్దీన్ పేరును ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ వద్దకు పంపింది. దానికి ఆమోదం తెలపాల్సి ఉంది.
News October 29, 2025
ములుగు: భారీ వర్షాలు.. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

తుఫాను ప్రభావం వల్ల రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. వర్షాల దృశ్య తక్షణ సహాయం కోసం కలెక్టరేట్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ 1800 4257109 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 24 గంటలు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.
News October 29, 2025
గుంటూరు జిల్లాలో పలు బస్సు సర్వీసులు రద్దు

మొంథా తుఫాన్ నేపథ్యంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆర్టీసీ పలు సర్వీసులను రద్దు చేసినట్లు డీపీటీఓ సామ్రాజ్యం తెలిపారు. గుంటూరు-1, 2, మంగళగిరి, తెనాలి, పొన్నూరు డిపోల్లో కొన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారని, తద్వారా రద్దీ తగ్గడంతో సర్వీసులు తగ్గిస్తున్నట్లు తెలిపారు. కొన్నిచోట్ల వాగులు పొంగటం, చెట్లు పడటంతో రద్దు చేశామన్నారు.


