News October 28, 2025

అల్లూరి: ‘తుఫాన్ ఎఫెక్ట్.. 4 రాత్రి బస్సు సర్వీసులు రద్దు’

image

మెుంథా తుఫాన్ వలన అల్లూరి, అనకాపల్లి జిల్లాల వైపు రాత్రివేళల్లో వెళ్లే నాలుగు బస్సు సర్వీసులను మంగళవారం నిలుపుదల చేయడం జరిగిందని ఏలేశ్వరం డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. రాజవొమ్మంగి, రేవళ్ళ, నర్సీపట్నం, వై.రామవరం సర్వీసులు రద్దు అయ్యాయన్నారు. ఉన్నతస్థాయి అధికారులు ఆదేశాలపై చర్యలు తీసుకొన్నామని పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

Similar News

News October 29, 2025

అజహరుద్దీన్‌కు మంత్రి పదవి

image

ఎల్లుండి తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నిన్న అజహరుద్దీన్, ఆయన కుమారుడు అసదుద్దీన్‌తో భేటీలో సీఎం రేవంత్ మంత్రి పదవిని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో మైనారిటీలు లేకపోవడంతో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. MLCగా అజహరుద్దీన్ పేరును ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ వద్దకు పంపింది. దానికి ఆమోదం తెలపాల్సి ఉంది.

News October 29, 2025

ములుగు: భారీ వర్షాలు.. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

image

తుఫాను ప్రభావం వల్ల రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. వర్షాల దృశ్య తక్షణ సహాయం కోసం కలెక్టరేట్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ 1800 4257109 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 24 గంటలు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.

News October 29, 2025

గుంటూరు జిల్లాలో పలు బస్సు సర్వీసులు రద్దు

image

మొంథా తుఫాన్‌ నేపథ్యంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆర్టీసీ పలు సర్వీసులను రద్దు చేసినట్లు డీపీటీఓ సామ్రాజ్యం తెలిపారు. గుంటూరు-1, 2, మంగళగిరి, తెనాలి, పొన్నూరు డిపోల్లో కొన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారని, తద్వారా రద్దీ తగ్గడంతో సర్వీసులు తగ్గిస్తున్నట్లు తెలిపారు. కొన్నిచోట్ల వాగులు పొంగటం, చెట్లు పడటంతో రద్దు చేశామన్నారు.